News February 11, 2025

రైతులకు యూనిక్ కోడ్.. పొందడం ఎలా?

image

‘ఫార్మర్ రిజిస్ట్రీ’ ప్రాజెక్టులో భాగంగా రైతులకు కేంద్రం 11 నంబర్లతో కూడిన యూనిక్ కోడ్‌ను కేటాయిస్తోంది. ఈ ప్రక్రియ నిన్న ఏపీలోనూ ప్రారంభమైంది. తొలి రోజు 63వేల మందికి UC జారీ అయినట్లు సమాచారం. దీనికోసం apfr.agristack.gov.in <>వెబ్‌సైట్‌లో<<>> ఆధార్ నంబర్, ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాలి. మీ ల్యాండ్ వివరాలు చూపిస్తుంది. సర్వే నంబర్లు సెలెక్ట్ చేసి సబ్మిట్ చేసి, ఓటీపీ ఎంటర్ చేస్తే ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్ జనరేట్ అవుతుంది.

Similar News

News December 12, 2025

జియో యూజర్లకు గుడ్‌న్యూస్

image

జియో స్టార్‌తో తమ కాంట్రాక్ట్ కొనసాగుతుందని ICC స్పష్టం చేసింది. క్రికెట్ మ్యాచుల స్ట్రీమింగ్ రైట్స్‌ను జియో రద్దు చేసుకోనుందంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ప్రకటన విడుదల చేసింది. రానున్న టీ20 WCతో పాటు ICC ఈవెంట్లన్నింటినీ నిరంతరాయంగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో ఇకపై జియో హాట్‌స్టార్‌లో ఫ్రీగా మ్యాచులు చూడలేమనుకున్న యూజర్లకు ఈ ప్రకటన భారీ ఊరట కలిగించింది.

News December 12, 2025

వాజ్‌పేయితో అనుబంధాన్ని గుర్తుచేసుకున్న సత్యకుమార్

image

AP: అటల్-మోదీ సుపరిపాలన యాత్రలో భాగంగా కర్నూలులో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి సత్యకుమార్ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ‘వాజ్‌పేయ్‌కు-నాకు-కర్నూలుకు ఓ అనుబంధం ఉంది. నేను 1993లోనే ఢిల్లీ వెళ్లడంతో వాజ్‌పేయ్‌తో పరిచయమైంది. 2018లో వాజ్‌పేయ్ కీర్తిశేషులయ్యాక ఆయన అస్థికలను ఢిల్లీ నుంచి తెచ్చి నా చేతుల మీదుగా పవిత్ర తుంగభద్ర నదిలో కలిపే అవకాశం దక్కింది’ అని తెలిపారు.

News December 12, 2025

మహిళా జర్నలిస్టుతో శశిథరూర్.. వైరలవుతున్న ఫొటోలు

image

కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ ఓ మహిళా జర్నలిస్టుతో ఉన్న ఫొటోలు SMలో వైరల్ అవుతున్నాయి. థరూర్‌ భుజంపై ఆమె చేతులు వేసి ఉన్న పోజ్‌పై నెట్టింట తెగ చర్చ జరుగుతోంది. కాగా ఆమె పేరు రంజున్ శర్మ. రష్యా రాజధాని మాస్కోలో RT ఇండియా న్యూస్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకూ థరూర్ లేదా రంజున్ ఈ విషయంపై స్పందించలేదు.