News October 1, 2024
తిరుపతిలో పవన్ సభ ఎలా పెడతారు: MP గురుమూర్తి

సుప్రీంకోర్టులో లడ్డూ అంశం పెండింగ్లో ఉన్నప్పుడు తిరుపతిలో DY CM పవన్ బహిరంగ సభ నిర్వహించడం సరికాదని ఎంపీ గురుమూర్తి ట్వీట్ చేశారు. ‘పవిత్ర తిరుపతి లడ్డూ కల్తీపై సరైన విచారణ కూడా చేయకుండా నిరాధారమైన వ్యాఖ్యలు చేసినందుకు సీఎం చంద్రబాబుపై సుప్రీంకోర్టు మండిపడింది. బాధ్యతాయుతమైన ఉపముఖ్యమంత్రి హోదాలో ఉన్న మీరు ముందే నిర్ధారణకు వచ్చి ప్రాయశ్చిత్త దీక్ష ఎలా చేస్తారు?’ అని ప్రశ్నించారు.
Similar News
News December 8, 2025
ఇండిగో అంశం కేంద్రం పరిధిలోనిది: చంద్రబాబు

AP: ఇండిగో సంక్షోభాన్ని తాము పర్యవేక్షించడం లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, సాధ్యమైనంత వరకు సమస్యను పరిష్కరిస్తుందన్నారు. కేంద్రమంత్రి భారత ప్రభుత్వానికి జవాబుదారీ అని చంద్రబాబు తెలిపారు. కాగా ఇండిగో సంక్షోభాన్ని మంత్రి లోకేశ్ మానిటర్ చేస్తున్నారని ఇటీవల ఓ టీవీ డిబేట్లో టీడీపీ MLC దీపక్ రెడ్డి చేసిన కామెంట్స్పై విమర్శలు వ్యక్తమయ్యాయి.
News December 8, 2025
10ఏళ్లలో రూ.కోటి విలువ రూ.55లక్షలే!

మీరు దాచుకున్న డబ్బు విలువ కాలక్రమేణా ద్రవ్యోల్బణం కారణంగా తగ్గిపోతుందనే విషయం మీకు తెలుసా? మీ దగ్గర రూ.కోటి ఉంటే ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణం(6%) కొనసాగితే మరో పదేళ్లలో అది ₹55.8 లక్షలకు చేరనుంది. 2045లో రూ.31.18లక్షలు, 2075నాటికి ₹కోటి విలువ రూ.5.4లక్షలకు పడిపోనుంది. అందుకే డబ్బును పొదుపు చేయడంతో పాటు సంపద విలువను కాపాడుకోవడానికి పెట్టుబడి పెట్టడం అలవర్చుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
News December 8, 2025
కేంద్ర ఉద్యోగులకు వేతన సవరణ ఆలస్యమేనా!

7వ PRC గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. 2026 JAN నుంచి 8వ PRC అమలు కావాలి. ఈ కమిషన్ను కేంద్రం ఈ ఏడాది JANలో వేసినా టర్మ్స్ను NOVలో కానీ ప్రకటించలేదు. కాగా PRCపై LSలో MPలు ప్రశ్నించగా ‘ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఎప్పటినుంచి అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. కమిషన్ నివేదికకు 18 నెలల సమయం పడుతుంది’ అని మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. దీంతో కేంద్ర ఉద్యోగులు ఎదురుచూస్తున్న PRC అమలు ఆలస్యం కావొచ్చంటున్నారు.


