News April 2, 2025
శుభకార్యాల వేళ హిజ్రాల దోపిడీని అరికట్టేదెలా?

హైదరాబాద్లో హిజ్రాల దోపిడీ పెరిగిపోయింది. ఫంక్షన్ ఏదైనా ఇంట్లోకి వచ్చేసి డబ్బులు డిమాండ్ చేస్తూ బంధువుల ముందు పరువు తీస్తున్నారని నగరవాసులు SMలో వాపోతున్నారు. తాజాగా కూకట్పల్లిలో ఓ ఇంట్లో పూజ జరుగుతుండగా అక్కడికి వచ్చి రూ.8వేలు వసూలు చేశారు. ఆ తర్వాత ఇంటి గుమ్మానికి తమ సంతకం చేసి వెళ్లిపోయారు. ఇలాంటి ఘటనలపై పోలీసులకు ఫిర్యాదులందినా, చర్యలు లేవని నెట్టింట విమర్శలొస్తున్నాయి.
Similar News
News December 25, 2025
భవిష్యత్లో సిరులు కురిపించనున్న కాపర్!

రానున్న రోజుల్లో కాపర్ (రాగి) ధరలు మరింతగా పెరుగుతాయని వ్యాపార విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిన్న టన్ను కాపర్ ధర $12వేలు దాటింది. ఎలక్ట్రిక్ వాహనాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్లు, పవర్ గ్రిడ్ నిర్మాణాలకు ఇవి ఎంతో కీలకం కాబట్టి ధరలు పెరుగుతున్నాయని తెలిపారు. 2030 నాటికి కాపర్ డిమాండ్ 60% పెరుగుతుందని అంచనా వేశారు. బంగారం, వెండిలాగే కాపర్పైనా పెట్టుబడులు పెట్టాలని సూచిస్తున్నారు.
News December 25, 2025
వార్నర్ రికార్డు సమం చేసిన రోహిత్

సుమారు 7 ఏళ్ల తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో ఆడిన స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ భారీ శతకంతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. నిన్నటి మ్యాచులో 155 పరుగులు చేసిన హిట్ మ్యాన్ లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక సార్లు 150+ స్కోర్ చేసిన ప్లేయర్గా డేవిడ్ వార్నర్(9) రికార్డును సమం చేశారు. అంతేకాకుండా అనుస్తుప్ మజుందార్(39y-బెంగాల్) తర్వాత VHTలో శతకం బాదిన అతిపెద్ద వయస్కుడిగానూ రోహిత్(38y 238d) నిలిచారు.
News December 25, 2025
త్వరలో కొత్త మెయిల్ ఐడీలు! గూగుల్ కీలక నిర్ణయం

త్వరలో జీమెయిల్ యూజర్ ఐడీ మార్చుకునే ఫీచర్ను అందుబాటులోకి తెస్తున్నట్టు గూగుల్ వెల్లడించింది. కొత్త యూజర్ ఐడీతోపాటు పాత ఐడీ యాక్టివ్గానే ఉంటుందని, ఇన్బాక్స్ ఒకటేనని తెలిపింది. పాత ఐడీ మళ్లీ పొందాలంటే 12నెలలు ఆగాల్సిందేనని చెప్పింది. జీమెయిల్ అకౌంట్తో లింకైన ఫేస్బుక్, ఇన్స్టా, వాట్సాప్, ఆధార్ యూజర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. ఈ ఫీచర్ దశలవారీగా అమలులోకి వస్తుందని తెలిపింది.


