News December 28, 2024

మన్మోహన్‌లా వాజ్‌పేయికీ జరిగితే BJP ఎలా ఫీలయ్యేది: కాంగ్రెస్ నేత

image

మన్మోహన్ స్మారక స్థలం కేటాయింపు అంశంలో BJPపై కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధూ విమర్శలు కురిపించారు. రాజ్‌ఘాట్‌లో అటల్ బిహారీ వాజ్‌పేయి స్మారకానికి స్థలం ఇవ్వకపోతే మీ పార్టీ ఎలా ఫీలయ్యేదని ప్రశ్నించారు. ‘మనిషి చనిపోయిన వెంటనే శత్రుత్వాలన్నీ మన్నులో కలిసిపోతాయి. కానీ ఇక్కడా రాజకీయాలు చేస్తున్నారు. అటల్‌జీ విషయంలో ఇలాగే జరిగేతే మీకెలా ఉండేది? ఇది ఓ పార్టీ అంశం కాదు. దేశ చరిత్రది’ అని అన్నారు.

Similar News

News December 11, 2025

ఫ్లైట్ జర్నీలో సమస్యలుంటే ఇలా చేయండి

image

ఇండిగో సేవలు సాధారణస్థితికి వచ్చినా కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ‘ప్రయాణికుల కంప్లైంట్స్ రియల్ టైమ్ పరిష్కారం కోసం క్రమం తప్పకుండా నిఘా ఉంచుతున్నాం. ఏదైనా సమస్య ఉంటే Xలో @MoCA_GoIని ట్యాగ్ చేయండి. కంట్రోల్ రూమ్‌ను 011-24604283/011-24632987 నంబర్‌లలో సంప్రదించండి. AirSewa యాప్/వెబ్ పోర్టల్‌లోనూ ఫిర్యాదు చేయొచ్చు’ అని ట్వీట్ చేశారు.

News December 11, 2025

మోదీకి నెతన్యాహు ఫోన్

image

ప్రధాని మోదీకి ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహు ఫోన్ చేశారు. ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి అనుసరించాల్సిన అంశాలపై చర్చించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో పరిస్థితులపై మోదీ ఆరా తీశారు. గాజాలో శాంతి స్థాపనకు తమ సహకారం ఉంటుందని మోదీ పునరుద్ఘాటించారు.

News December 10, 2025

US వెళ్లేందుకు వారు ఐదేళ్ల SM హిస్టరీ ఇవ్వాలి!

image

UK సహా వివిధ దేశాల నుంచి అమెరికా వెళ్లే వాళ్లు ఇకపై ఐదేళ్ల సోషల్ మీడియా హిస్టరీ ఇవ్వాల్సి ఉంటుందని తెలుస్తోంది. వీసా అవసరంలేని దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఈ రూల్ తప్పనిసరి చేసేలా US ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మార్పుతో యూరప్, AUS, న్యూజిలాండ్, సౌత్ కొరియా, జపాన్, సింగపూర్, ఖతర్, ఇజ్రాయెల్ వంటి 40 దేశాలపై ప్రభావం పడుతుంది. సాధారణంగా ఈ దేశాల పౌరులు వీసా లేకుండా 90 డేస్ అమెరికాలో ఉండొచ్చు.