News June 25, 2024

భారీ వేలమే.. కానీ నో ఇంట్రెస్ట్!

image

నేడు జరగనున్న 5జీ వేలానికి టెలికాం సంస్థలు పెద్దగా ఆసక్తి కనబరచట్లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే సరిపడా 5జీ బ్యాండ్లు ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కేంద్రానికి సంస్థలు చేసిన ఎర్నెస్ట్ డిపాజిట్ 2022తో పోలిస్తే 79-86% తక్కువ. జియో ₹3వేలకోట్లు, ఎయిర్‌టెల్ ₹1,050కోట్లు, Vi ₹300 కోట్లు కేటాయించాయి. ₹96,320cr విలువైన వేలంలో 13% (₹12,500) మాత్రమే సంస్థలు కొనుగోలు చేయనున్నట్లు అంచనా.

Similar News

News January 18, 2026

మాడ్యులర్ కిచెన్ చేయిస్తున్నారా?

image

మాడ్యులర్ కిచెన్‌ చేయించేటపుడు వెంటిలేషన్ బాగా ఉండేలా చూసుకోవాలి. సరుకులన్నీ భద్రపరచడానికి వీలుగా అల్మారా లేదా డీప్ డ్రాలను నిర్మించుకోవాలి. చాకులు, స్పూన్‌లు, గరిటెలు విడివిడిగా పెట్టుకొనే సౌలభ్యం ఉండేలా చూసుకోవాలి. అప్పుడే వస్తువులు నీట్‌గా కనిపిస్తాయి. కావాల్సిన వస్తువు వెంటనే చేతికి దొరుకుతుంది. వంటగదిలో ఎలక్ట్రానిక్ పరికరాలు వాడటానికి వీలుగా అవసరమైన చోట్లలో ప్లగ్ బోర్డ్స్ ఉండేలా చూసుకోవాలి.

News January 18, 2026

ప్రైవేట్ స్కూళ్లలో రెండేళ్లకోసారి 8% ఫీజు పెంపు?

image

TG: ప్రైవేట్ స్కూళ్లలో ఫీజును రెండేళ్లకోసారి 8% పెంచుకునేలా అనుమతించాలని విద్యాశాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అంతకుమించి పెంచుకోవాలంటే రాష్ట్ర ఫీజు నియంత్రణ కమిటీ ఆమోదం తప్పనిసరి చేస్తూ ఫీజుల నియంత్రణ చట్టం విధివిధానాలను ఖరారు చేసినట్లు సమాచారం. మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాత జరిగే క్యాబినెట్ సమావేశంలో దీనిపై చర్చించి చట్టాన్ని తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

News January 18, 2026

జీవ ఎరువుల వాడకం – తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

రైతు వాడే జీవ ఎరువు ఆ పంటకు సరైనదై ఉండాలి. ఈ ఎరువు ప్యాకెట్లను నీడ ప్రదేశంలోనే నిల్వచేయాలి. ప్యాకెట్‌పై పేర్కొన్న గడువు తేదీలోపే వాడుకోవాలి. రసాయన ఎరువులతో కలిపి జీవ ఎరువులు వాడరాదు. పొలంలో తగినంత తేమ ఉన్నప్పుడే వీటిని వాడుకోవాలి. సేంద్రియ ఎరువుతో జీవ ఎరువు కలిపిన వెంటనే పంటకు వాడుకోవాలి. ఈ ఎరువులను తొలిసారి వినియోగిస్తుంటే వ్యవసాయ అధికారులను సంప్రదించి వారి సూచనల మేరకే వినియోగించాలి.