News May 12, 2024
కుంకుమ పువ్వునకు భారీ డిమాండ్

దేశంలో కుంకుమ పువ్వునకు డిమాండ్ భారీగా పెరిగింది. సరఫరా తగ్గడంతో కిలో పువ్వు ఏకంగా రూ.5 లక్షలు పలుకుతోంది. వంటల నుంచి సౌందర్య సాధనాల వరకు పలు ఉత్పత్తుల్లో దీన్ని వినియోగిస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా కుంకుమ పువ్వు ఉత్పత్తిలో 90శాతం ఇరాన్ నుంచే వస్తుంది. గత కొంతకాలంగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అక్కడి నుంచి సరఫరా బాగా తగ్గింది. ఈ నేపథ్యంలో డిమాండ్ పెరిగిందంటున్నారు పరిశీలకులు.
Similar News
News November 26, 2025
రెండు మండలాలుగా విభజన కానున్న ఆదోని

కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతమైన ఆదోని మండలాన్ని విభజించి రెండు మండలాలుగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. మండలంలో మొత్తం 46 గ్రామాల పరిధిలో 2,69,286 మంది జనాభా ఉన్నారు. పెద్దహరివాణం కేంద్రంగా ఏర్పడే మండలంలో 16 గ్రామాలను చేర్చనున్నారు. 43,105 మంది జనాభా ఉంటారు. ఆదోని కేంద్రంగా ఉండే మండలంలో 30 గ్రామాలు ఉంటాయి. 2,26,181 మంది జనాభా ఉంటారు.
News November 26, 2025
నేటి నుంచి మౌఢ్యమి.. శుభ కార్యాలు ఎందుకు చేయకూడదంటే?

ఈరోజు నుంచి మౌఢ్యమి ప్రారంభం కానుంది. ఇది వచ్చే ఏడాది FEB 17 వరకు 83 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ రోజుల్లో గురు, శుక్ర గ్రహాలు సూర్యుడి దగ్గరి వరకు వెళ్లడంతో వాటి శక్తి తాత్కాలికంగా క్షీణిస్తుంది. అయితే శుభ కార్యాలకు ఈ గ్రహాల బలం అవసరం. ఆ బలం తగ్గినప్పుడు శుభ కార్యాలు చేస్తే ఫలితం ఉండదని నమ్ముతారు. ☞ మౌఢ్యమి రోజుల్లో ఏయే పనులు చేయవచ్చు, వేటిని చేయకూడదో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.
News November 26, 2025
నేటి నుంచి మౌఢ్యమి.. శుభ కార్యాలు ఎందుకు చేయకూడదంటే?

ఈరోజు నుంచి మౌఢ్యమి ప్రారంభం కానుంది. ఇది వచ్చే ఏడాది FEB 17 వరకు 83 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ రోజుల్లో గురు, శుక్ర గ్రహాలు సూర్యుడి దగ్గరి వరకు వెళ్లడంతో వాటి శక్తి తాత్కాలికంగా క్షీణిస్తుంది. అయితే శుభ కార్యాలకు ఈ గ్రహాల బలం అవసరం. ఆ బలం తగ్గినప్పుడు శుభ కార్యాలు చేస్తే ఫలితం ఉండదని నమ్ముతారు. ☞ మౌఢ్యమి రోజుల్లో ఏయే పనులు చేయవచ్చు, వేటిని చేయకూడదో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.


