News January 25, 2025

MHలో భారీ పేలుడు.. 8కి చేరిన మృతుల సంఖ్య

image

మహారాష్ట్ర భండారాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో జరిగిన భారీ <<15243613>>పేలుడు<<>> ఘటనలో మృతుల సంఖ్య 8కి చేరినట్లు నాగపూర్ పోలీసులు వెల్లడించారు. ఉ.11గంటలకు ఘటన జరగ్గా, సహాయక చర్యలకు 8గంటల సమయం పట్టిందన్నారు. ఘటన జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో ఉన్న 13మందిలో 8మంది చనిపోగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయని చెప్పారు. ప్రమాదం పట్ల విచారం వ్యక్తం చేసిన ఆ రాష్ట్ర CM ఫడణవీస్ మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

Similar News

News November 14, 2025

పడుకునే ముందు ఇవి తినవద్దు!

image

చాలా మంది లేట్ నైట్ పడుకునే ముందు కొన్ని రకాల స్నాక్స్, అన్‌హెల్దీ ఫుడ్ లాగించేస్తుంటారు. అది ఏమాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. ముఖ్యంగా పిజ్జా, బర్గర్స్, ఐస్‌క్రీమ్స్, కేక్స్, కూల్‌డ్రింక్స్ తీసుకోవద్దని చెబుతున్నారు. ఇవి జీర్ణ సంబంధిత సమస్యలకు దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు. అలాగే చికెన్, మటన్ తీసుకోవడం వల్ల అజీర్తితో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. రాత్రివేళ లైట్ ఫుడ్ తీసుకుంటే బెటర్.

News November 14, 2025

పరకామణి కేసు.. అతడిది హత్యే!

image

AP: తిరుమల పరకామణి కేసులో <<18284340>>మృతి<<>> చెందిన మాజీ AVSO సతీశ్‌ది హత్యేనని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. అనంతపురం సర్వజన ఆసుపత్రిలో ఫోరెన్సిక్, పోలీసుల పర్యవేక్షణలో మృతదేహానికి సిటీ స్కాన్ చేయగా అతడి తల వెనుక గొడ్డలి తరహా ఆయుధంతో నరికినట్లు గుర్తించారు. పరకామణి కేసులో ఫిర్యాదుదారు అయిన సతీశ్ CID ముందు రెండోసారి విచారణకు వస్తూ హత్యకు గురయ్యారు. కోమలి రైల్వే పట్టాల సమీపంలో ఆయన శవమై కనిపించారు.

News November 14, 2025

వివాహం గురించి వేదాలేమంటున్నాయి?

image

పెళ్లంటే నూరేళ్ల పంట. వివాహం కుటుంబ వ్యవస్థకు ప్రధానమైన ఆధారం. ఇది గృహస్థాశ్రమ ధర్మానికి నాంది. మన మేధో వికాసానికి, సామాజిక ఎదుగుదలకు ఇది అత్యంత ముఖ్యమైనదని వేదాలు కూడా చెబుతున్నాయి. ఈ పవిత్ర వ్యవస్థ గొప్పతనాన్ని ప్రపంచమంతా కొనియాడుతుంది. వివాహం ద్వారానే సంస్కృతికి, సమాజానికి పునాది పడుతుంది. అందుకే ఈ బంధాన్ని పవిత్రంగా గౌరవించాలి. ఈ బంధం రేపటి తరానికి ఉత్తమమైన వారసత్వాన్ని అందిస్తుంది. <<-se>>#Pendli<<>>