News December 24, 2024
ఉ.కొరియాకు భారీ మిలటరీ లాస్: జెలెన్స్కీ

రష్యా తరఫున తమతో యుద్ధం చేస్తోన్న ఉత్తరకొరియా సైనికులు 3వేల మంది చనిపోవడం లేదా తీవ్రంగా గాయపడినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు. కుర్స్క్ రీజియన్ నుంచి తమకు ఈ ప్రాథమిక నివేదిక అందిందన్నారు. మరిన్ని అదనపు బలగాలు, ఆయుధ సామగ్రిని నార్త్ కొరియా పంపనుందని, ఆ ముప్పును ఎదుర్కొనేందుకు తాము కూడా సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
Similar News
News October 15, 2025
ఏటా లక్షమంది ఉద్యోగులకు AI శిక్షణ: TCS

IT దిగ్గజం TCS సంస్థ తమ ఉద్యోగులకు AIలో శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఏటా లక్షమంది ఉద్యోగులకు ట్రైనింగ్ ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆ సంస్థ CTO హారిక్ విన్ తెలిపారు. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కోసం AI టూల్స్తో ప్రయోగాలు, హ్యాకథాన్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. ఇప్పుడు ప్రతి సంస్థ ఇలాగే చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం TCSలో దాదాపు 5.93 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.
News October 15, 2025
రెండు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

AP: కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని స్కూళ్లకు ఇవాళ, రేపు సెలవు ప్రకటించారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటూ డీఈవోలు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే విద్యార్థులకు సమాచారం అందించినట్లు పేర్కొన్నారు. ఇవాళ, రేపు జరగాల్సిన FA-2 పరీక్షలు 17, 18న నిర్వహించుకోవాలని స్కూళ్ల ప్రిన్సిపాళ్లకు సూచించారు.
News October 15, 2025
నైవేద్యం సమర్పించేటప్పుడు తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయాలు

నైవేద్యం పెట్టేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. స్వామి నైవేద్యం కోసం వండిన పదార్థాన్ని విడిగా తీసి పెట్టకుండా, పెట్టే పాత్రలో నిండుగా ఉంచాలి. నైవేద్య నివేదన తర్వాత నీళ్లు పెట్టడం అస్సలు మరవొద్దు. వీలైనంత ఎక్కువ సమయం నైవేద్యాన్ని స్వామివారి సన్నిధిలో ఉంచడం శుభకరం. నైవేద్య పదార్థాలలో బెల్లంతో వండిన వాటికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం శ్రేయస్కరం. ఈ నియమాలు భక్తిని, శుచిని తెలియజేస్తాయి. <<-se>>#POOJA<<>>