News May 25, 2024

భారీగా పోస్టల్ బ్యాలెట్‌లు.. కౌంటింగ్ ఆలస్యమే!

image

APలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ దఫా ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. భారీగా నమోదైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లే ఇందుకు కారణం. 2019లో 2.62లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుంటే ఈసారి ఆ సంఖ్య 4.97 లక్షలుగా ఉంది. వీటి లెక్కింపునకు సుదీర్ఘ సమయం పడుతుంది. పైగా వీటి తర్వాతే ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. జూన్ 4న ఉ.8గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుండగా.. 10గంటల తర్వాతే ట్రెండ్ తెలిసే పరిస్థితులున్నాయి.

Similar News

News January 19, 2026

యథావిధిగా పీజీఆర్ఎస్: కలెక్టర్ వెట్రిసెల్వి

image

ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ కార్యక్రమం యథావిధిగా సోమవారం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి ఆదివారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండల, డివిజన్‌లోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. 1100 టోల్ ఫ్రీ నంబర్‌కు సంప్రదించి ఫిర్యాదుల స్థితిని, తదితర సమాచారాన్ని తెలుసుకోవచ్చన్నారు.

News January 19, 2026

అనకాపల్లి: ప్రజా సమస్యల పరిష్కార వేదిక నేడు

image

అనకాపల్లి కలెక్టరేట్‌తో పాటు మున్సిపల్, డివిజన్, మండల స్థాయి కార్యాలయాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించనున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ ఓ ప్రకటనలో తెలిపారు. స్వయంగా రాలేని వారు meekosam.ap.gov.in వెబ్ సైట్ ద్వారా అర్జీలను పంపించవచ్చునని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News January 19, 2026

అనకాపల్లి: ప్రజా సమస్యల పరిష్కార వేదిక నేడు

image

అనకాపల్లి కలెక్టరేట్‌తో పాటు మున్సిపల్, డివిజన్, మండల స్థాయి కార్యాలయాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించనున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ ఓ ప్రకటనలో తెలిపారు. స్వయంగా రాలేని వారు meekosam.ap.gov.in వెబ్ సైట్ ద్వారా అర్జీలను పంపించవచ్చునని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.