News September 28, 2024

భారీగా పెరిగిన ధరలు

image

దసరా పండుగకు ముందు నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా పెరగడంపై సామాన్యుడు భగ్గుమంటున్నాడు. ఇప్పటికే నూనె ధరలు లీటరుపై రూ.20-45 వరకూ పెరిగాయి. అల్లం కిలో రూ.100 నుంచి రూ.150, వెల్లుల్లి రూ.300 నుంచి రూ.360, ఎండు మిర్చి రూ.200 నుంచి రూ.240, కందిపప్పు కిలో రూ.150 నుంచి రూ.175, పెసరపప్పు రూ.30 పెరిగి రూ.150, మినపపప్పు రూ.135కి చేరింది. ఇక ఉల్లి ధరలు రూ.60 నుంచి కిందకు దిగడం లేదు. కూరగాయల ధరలూ అంతే ఉన్నాయి.

Similar News

News September 28, 2024

విజన్ 2047 కోసం మీ సలహాలివ్వండి: చంద్రబాబు

image

AP భవిష్యత్తు కోసం ప్రజల నుంచి సలహాలు స్వీకరిస్తున్నట్లు CM చంద్రబాబు తెలిపారు. ‘2047 నాటికి $2.4 ట్రిలియన్ GSDP, $43,000 కంటే ఎక్కువ తలసరి ఆదాయంతో దేశాన్ని ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యం. స్వర్ణాంధ్ర 2047 వైపు ప్రయాణం ప్రారంభించినందున మెరుగైన రాష్ట్ర భవిష్యత్తు కోసం పౌరుల నుంచి సూచనలు స్వీకరిస్తున్నాం. కలిసి APని నిర్మించుకుందాం’ అని CM పిలుపునిచ్చారు. మీ ఆలోచనను పంచుకునేందుకు ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

News September 28, 2024

నిజమేనని తేలితే RGకర్ మాజీ ప్రిన్సిపల్‌కు మరణదండనే: CBI కోర్టు

image

RGకర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్‌ఘోష్‌కు CBI కోర్టు బెయిల్ నిరాకరించింది. ఆయనపై నమోదైన అభియోగాలు తీవ్రమైనవని, నిజమేనని తేలితే మరణదండనకు దారితీస్తాయని తెలిపింది. నిందితుడిని బెయిల్‌పై రిలీజ్ చేయడం అన్యాయమే అవుతుందంది. టాలా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అభిజిత్ మండల్ బెయిల్‌నూ తిరస్కరించింది. కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ హత్యాచారం కేసులో సాక్ష్యాల ట్యాంపరింగ్, FIR లేట్ కేసులో వీరు అరెస్టయ్యారు.

News September 28, 2024

నేడు తిరుమలకు సిట్

image

AP: లడ్డూ వివాదం నేపథ్యంలో ఏర్పాటైన సిట్ ఇవాళ తిరుమలలో పర్యటించనుంది. సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆధ్వర్యంలోని బృందం టీటీడీ ఈవో శ్యామలరావుతో సమావేశం కానుంది. కల్తీ నెయ్యి వ్యవహారంపై వివరాలు సేకరించనున్నారు.