News December 2, 2024
ఒక్క ‘పదం’తో ఆగిన వందలాది రిజిస్ట్రేషన్లు

TG: HYDలోని కుత్బుల్లాపూర్ పరిధిలో ఒక ‘పదం’ వల్ల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. అక్కడి 58, 226 సర్వే నంబర్లలో ఎకరం ఒక గుంట వక్ఫ్ బోర్డు స్థలం ఉండటంతో రిజిస్ట్రేషన్ చేయొద్దని వక్ఫ్ బోర్డ్ ఆగస్టులో ఆదేశాలిచ్చింది. అందులో 58 మరియు 226 బదులు..58 నుండి 226 అని తప్పుగా టైప్ కావడంతో 168 సర్వే నంబర్ల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. దీంతో 3నెలలుగా ఇబ్బందులు పడుతున్నామని రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారు వాపోతున్నారు.
Similar News
News January 25, 2026
నేషనల్ ఏరోస్పేస్ లాబోరేటరీస్లో పోస్టులు

<
News January 25, 2026
ఆదివారం రోజున ఈ పనులు చేస్తున్నారా?

ఆదివారం, సప్తమి రోజుల్లో కొన్ని పనులు చేస్తే సూర్య దోషం కలగవచ్చని పండితులు చెబుతున్నారు. ‘మద్యమాంసాలు ముట్టకూడదు. క్షురకర్మ చేసుకోకూడదు. తలస్నానానికి నూనె వాడకూడదు. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం అశుభం. తోలు వస్తువుల వాడకాన్ని తగ్గించాలి. సూర్యాస్తమయానికి ముందే తినేయాలి. ఆ తర్వాత చేసే భోజనం ఆరోగ్యపరంగా మంచిది కాదు. ఈ నియమాలు అతిక్రమిస్తే దారిద్ర్యం, అనారోగ్యం, కంటి సమస్యలు వచ్చే అవకాశముంది’ అంటున్నారు.
News January 25, 2026
థాంక్యూ ఇండియా: ఇరాన్

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (UNHRC)లో తమకు అండగా నిలిచినందుకు ఇండియాకు ఇరాన్ థాంక్స్ చెప్పింది. ‘మాకు మద్దతు ఇచ్చినందుకు ఇండియాకు కృతజ్ఞతలు. న్యాయం, జాతీయ సార్వభౌమత్వం విషయంలో ఆ దేశ వైఖరికి ఇది నిదర్శనం’ అని ఇరాన్ రాయబారి మహ్మద్ ఫథాలీ అన్నారు. కాగా శాంతియుత నిరసనలను ఇరాన్ ప్రభుత్వం అణచేస్తోందంటూ UNHRC 39వ ప్రత్యేక సెషన్లో ప్రవేశపెట్టిన తీర్మానానికి వ్యతిరేకంగా భారత్ ఓటు వేసింది.


