News December 2, 2024
ఒక్క ‘పదం’తో ఆగిన వందలాది రిజిస్ట్రేషన్లు

TG: HYDలోని కుత్బుల్లాపూర్ పరిధిలో ఒక ‘పదం’ వల్ల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. అక్కడి 58, 226 సర్వే నంబర్లలో ఎకరం ఒక గుంట వక్ఫ్ బోర్డు స్థలం ఉండటంతో రిజిస్ట్రేషన్ చేయొద్దని వక్ఫ్ బోర్డ్ ఆగస్టులో ఆదేశాలిచ్చింది. అందులో 58 మరియు 226 బదులు..58 నుండి 226 అని తప్పుగా టైప్ కావడంతో 168 సర్వే నంబర్ల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. దీంతో 3నెలలుగా ఇబ్బందులు పడుతున్నామని రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారు వాపోతున్నారు.
Similar News
News January 31, 2026
‘దశరథ గడ్డి’ని ఎలా సాగు చేయాలి?

దశరథ గడ్డి(హెడ్జ్ లూసర్న్) పాడి పశువులకు, జీవాలకు మేలు చేసే బహువార్షిక పప్పుధాన్యపు గడ్డి. ఇందులో మాంసకృత్తులు, ప్రొటీన్లు, ఫైబర్, లిగ్నిన్ తదితర పోషకాలు అధికంగా ఉంటాయి. దీన్ని ఏడాది పొడవునా సాగుచేయవచ్చు. ఎకరాలో సాగుకు 10kgల విత్తనాలు సరిపోతాయి. కేజీ విత్తనానికి కేజీ ఇసుకను కలిపి వేయాలి. నీరు నిల్వ ఉండే నేలలు, చౌడు నేలలు దశరథ గడ్డి సాగుకు పనికిరావు. ఒక హెక్టారుకు 90-100 టన్నుల పశుగ్రాసం వస్తుంది.
News January 31, 2026
2 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ షురూ.. CCTVల నిఘాలో పరీక్షలు

TG: రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 2 నుంచి 11 వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు 1,440 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. ఉదయం 9-12, మధ్యాహ్నం 2-5 గంటల మధ్య ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. అన్ని సెంటర్లలో CCTV కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలకు సైన్స్ స్ట్రీమ్ నుంచి 4 లక్షలు, వొకేషనల్ నుంచి లక్ష మంది హాజరవుతారు. ఇప్పటికే వెబ్సైట్లో హాల్టికెట్లు అందుబాటులో ఉంచారు.
News January 31, 2026
ఉపగ్రహాలతో అతిపెద్ద AI డేటా సెంటర్ ఏర్పాటుకు మస్క్ సిద్ధం!

స్పేస్ఎక్స్ సరికొత్త చరిత్రకు సిద్ధమైంది. అంతరిక్షంలో ఏకంగా పది లక్షల ఉపగ్రహాలతో ప్రపంచంలోనే అతిపెద్ద ‘ఏఐ డేటా సెంటర్’ను నిర్మించనుంది. నిరంతర సౌరశక్తి, లేజర్ టెక్నాలజీతో పనిచేసే ఈ వ్యవస్థ ద్వారా AI కంప్యూటింగ్ సామర్థ్యాన్ని పెంచడమే దీని లక్ష్యమని మస్క్ తెలిపినట్లు రాయిటర్స్ పేర్కొంది. ఈ సెంటర్ అందుబాటులోకి వస్తే భూమిపై ఖర్చు తగ్గడమే కాకుండా డేటా ప్రాసెసింగ్ వేగం పెరుగుతుందని సమాచారం.


