News December 2, 2024
ఒక్క ‘పదం’తో ఆగిన వందలాది రిజిస్ట్రేషన్లు

TG: HYDలోని కుత్బుల్లాపూర్ పరిధిలో ఒక ‘పదం’ వల్ల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. అక్కడి 58, 226 సర్వే నంబర్లలో ఎకరం ఒక గుంట వక్ఫ్ బోర్డు స్థలం ఉండటంతో రిజిస్ట్రేషన్ చేయొద్దని వక్ఫ్ బోర్డ్ ఆగస్టులో ఆదేశాలిచ్చింది. అందులో 58 మరియు 226 బదులు..58 నుండి 226 అని తప్పుగా టైప్ కావడంతో 168 సర్వే నంబర్ల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. దీంతో 3నెలలుగా ఇబ్బందులు పడుతున్నామని రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారు వాపోతున్నారు.
Similar News
News December 19, 2025
నేషనల్ మెగా షిప్బిల్డింగ్ క్లస్టర్కు 3,488 ఎకరాలు: CBN

AP: తిరుపతి జిల్లా దుగరాజపట్నంలో నేషనల్ మెగాషిప్ బిల్డింగ్, రిపేర్ క్లస్టర్ ఏర్పాటుకు సహకరించాలని CM CBN కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ను కోరారు. ‘దీనికి అవసరమైన 3,488 ఎకరాలు కేటాయిస్తాం. టెక్నో–ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా సిద్ధంగా ఉంది. వెంటనే అనుమతివ్వండి’ అని కోరారు. ఫేజ్1లో ₹1361.49 కోట్లతో 4 హార్బర్ల పనులు చేపట్టామని, వాటికి కేంద్రం నుంచి రావలసిన నిధులివ్వాలని విన్నవించారు.
News December 19, 2025
UIIC 153 పోస్టులకు నోటిఫికేషన్

యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్ (<
News December 19, 2025
పిల్లలకు న్యుమోనియా ఉందా?

శీతాకాలంలో పిల్లలు న్యుమోనియా ప్రమాదం ఎక్కువ. అధిక జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయంటున్నారు నిపుణులు. ఆక్సిజన్ తగ్గితే చర్మం, పెదవులు నీలం రంగులోకి మారతాయి. ఇది కొన్నిసార్లు ప్రాణాంతకం కాబట్టి వెంటనే వైద్యులను సంప్రదించాలి. న్యుమోనియా ఉన్న పిల్లల గదిని శుభ్రంగా, వెచ్చగా ఉంచడం, సులభంగా జీర్ణమయ్యే ఆహారాలు, సూప్ ఇవ్వాలని సూచిస్తున్నారు.


