News April 25, 2024
భార్య చనిపోయిందని భర్త ఆత్మహత్య

యూపీలోని హర్దోయ్ ప్రాంతానికి చెందిన యోగేశ్(36), మణికర్ణిక(28)కు ఆర్నెల్ల క్రితం వివాహమైంది. అన్యోన్యంగా జీవిస్తున్న వారి దాంపత్యంపై విధి పగబట్టింది. మణికర్ణిక ఓ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ప్రాణంగా చూసుకుంటున్న భార్య మరణాన్ని తట్టుకోలేకపోయిన యోగేశ్, తాను కూడా ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారు. ‘కలిసి బతికాం, కలిసే చనిపోతాం’ అంటూ ఆయన రాసిన సూసైడ్ లెటర్ స్థానికంగా విషాదాన్ని నింపింది.
Similar News
News March 27, 2026
ఏప్రిల్ 21లోగా ఇంటర్ ఫలితాలు!

AP: ఇంటర్ ఎగ్జామ్స్ వాల్యుయేషన్ను ఏప్రిల్ 10-14 మధ్య పూర్తి చేసేందుకు ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. వచ్చే నెల 21లోపు ఫలితాలను వెల్లడించనున్నట్లు సమాచారం. మే తొలి వారంలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించే అవకాశం ఉంది. కాగా ఇంటర్ ఫస్ట్, సెకండియర్ పరీక్షలకు దాదాపు 10.37 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
News March 27, 2026
ధరలను నియంత్రించేందుకే ఎక్సైజ్ డ్యూటీ తగ్గించాం: కేంద్రం

ధరల పెరుగుదల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు పెట్రోల్, డీజిల్పై <<19487934>>ఎక్సైజ్ డ్యూటీ<<>> తగ్గించామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే డీజిల్ ఎగుమతులపై లీటర్కు 21.5, జెట్ ఫ్యూయల్ ఎగుమతులపై లీటర్కు 29.5 చొప్పున సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. దీని వల్ల చమురు కంపెనీలు తమ ఉత్పత్తిని అంతర్జాతీయ మార్కెట్కు అమ్ముకోకుండా దేశీయ అవసరాలకు ప్రాధాన్యం ఇస్తాయని పేర్కొన్నారు.
News March 27, 2026
ధరలను నియంత్రించేందుకే ఎక్సైజ్ డ్యూటీ తగ్గించాం: కేంద్రం

ధరల పెరుగుదల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు పెట్రోల్, డీజిల్పై <<19487934>>ఎక్సైజ్ డ్యూటీ<<>> తగ్గించామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే డీజిల్ ఎగుమతులపై లీటర్కు 21.5, జెట్ ఫ్యూయల్ ఎగుమతులపై లీటర్కు 29.5 చొప్పున సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. దీని వల్ల చమురు కంపెనీలు తమ ఉత్పత్తిని అంతర్జాతీయ మార్కెట్కు అమ్ముకోకుండా దేశీయ అవసరాలకు ప్రాధాన్యం ఇస్తాయని పేర్కొన్నారు.


