News January 28, 2025
హుస్సేన్ సాగర్ ఘటన: రెండుకు చేరిన మరణాలు

TG: రిపబ్లిక్ డే రోజున హుస్సేన్ సాగర్లో బోట్లు దగ్ధమైన ఘటనలో గల్లంతైన అజయ్ మృతదేహం లభించింది. రెండు రోజుల గాలింపు తర్వాత డీఆర్ఎఫ్ బృందాలు మృతదేహాన్ని వెలికితీశాయి. అజయ్ అచూకీ తెలియడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. అంతకుముందు ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గణపతి మరణించాడు.
Similar News
News October 17, 2025
మునగ సాగుకు ప్రభుత్వ సబ్సిడీలు ఇలా..

AP: మునగ సాగును ఉపాధి హామీ పథకానికి ప్రభుత్వం అనుసంధానించింది. గుంతలు తీయడం, మొక్కలు నాటడం, నీరు పెట్టడానికి డబ్బు చెల్లిస్తుంది. 25సెంట్లలో నాటితే రెండేళ్లలో ₹38,125, 50 సెంట్లకు ₹75,148, 75 సెంట్లకు ₹1.25L, ఎకరాకు ₹1.49L ఆర్థిక భరోసా ఉంటుంది. ఈ ఏడాది 12 జిల్లాల్లో(అన్నమయ్య, అనంతపురం, అనకాపల్లి, బాపట్ల, చిత్తూరు, నంద్యాల, గుంటూరు, ప్రకాశం, సత్యసాయి, శ్రీకాకుళం, పల్నాడు, తిరుపతి) అమలు చేస్తోంది.
News October 17, 2025
మునగ.. ప్రాసెసింగ్ ప్లాంట్ల ఏర్పాటుకు సాయం

AP: మునగ సాగు విస్తీర్ణానికి అనుగుణంగా ప్రాసెసింగ్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం చేయూతనందిస్తోంది. డ్వాక్రా మహిళ కుటుంబాన్ని యూనిట్గా తీసుకుని, ప్లాంట్ వ్యయాన్ని బట్టి ₹10L, ఆపైన కూడా సెర్ప్ ద్వారా రుణం మంజూరు చేయిస్తుంది. మునగ ప్రొడక్ట్లను కొనుగోలు చేసేలా ప్రైవేటు సంస్థలతో ఒప్పందాలు చేసుకోనుంది. దీనిద్వారా ఆయా కుటుంబాలు ఆర్థికంగా లాభపడనున్నాయి. పూర్తి వివరాలకు వ్యవసాయ అధికారులను సంప్రదించండి.
News October 17, 2025
‘డ్యూడ్’ రివ్యూ&రేటింగ్

ఎంతో ఇష్టపడే మరదలి ప్రేమను హీరో రిజక్ట్ చేయడం, తిరిగి ఎలా పొందాడనేదే ‘డ్యూడ్’ స్టోరీ. లవ్ టుడే, డ్రాగన్ సినిమాలతో యూత్లో క్రేజ్ తెచ్చుకున్న ప్రదీప్ రంగనాథ్ మరోసారి ఎనర్జిటిక్ యాక్టింగ్తో అలరించారు. హీరోయిన్ మమితా బైజు స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. కథ పాతదే అయినా కామెడీ, ట్విస్టులు బోర్ కొట్టకుండా చేస్తాయి. సెకండాఫ్ స్లోగా ఉండటం, ఎమోషన్స్ అంతగా కనెక్ట్ అవ్వకపోవడం మైనస్.
RATING: 2.75/5