News January 4, 2025

HYDకు మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీల నీరు!

image

2050 నాటికి HYDలో పెరిగే జనాభాకు తగ్గట్టు తాగు వాటర్, సీవరేజ్ ప్లానింగ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి జలమండలి అధికారులను ఆదేశించారు. HYDకు తాగునీటి సరఫరాలో భాగంగా రిపోర్టు ప్రకారం.. మల్లన్నసాగర్ నుంచి గోదావరి ఫేజ్-2 ద్వారా గతంలో ప్రతిపాదించిన 15 టీఎంసీలకు బదులుగా, 20 టీఎంసీల నీటి సరఫరా చేయాలని నిర్ణయించారు.

Similar News

News January 18, 2025

HYD: సినిమాల్లో ఛాన్స్ పేరుతో లైంగిక దాడి

image

సినిమాల్లో ఛాన్స్ అంటూ ఇటీవల ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆడిషన్స్ పేరుతో ఆశ చూపించి గదికి పిలిచి ఓ దుండగుడు అత్యాచారానికి ఒడిగట్టాడని పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు అసిస్టెంట్ డైరెక్టర్ రాజు మీద BNS 64,79,115,351(2) కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని జూబ్లీహిల్స్ పోలీసులు వెల్లడించారు. 

News January 18, 2025

RR: రైతు భరోసా.. ఈ సారి ఎంత మందికో!

image

ఉమ్మడి RR జిల్లాలో 6.3 లక్షల మంది రైతులు ఉండగా, గత చివరి సీజన్లో RR జిల్లా పరిధిలో 3.04 లక్షల మంది రైతులకు రూ.343.97 కోట్లు రైతుబంధు కింద రైతుల ఖాతాల్లో జమ చేశారు. వికారాబాద్ జిల్లాలో 2.70 లక్షలమంది రైతులకు రూ.319.36కోట్లు పంపిణీ చేశారు. మేడ్చల్ జిల్లా పరిధిలో 44,792 మంది రైతులకు రూ.39.74కోట్లు రైతులఖాతాల్లో జమ చేశారు. ప్రస్తుతం రైతుభరోసాకు సంబంధించి సర్వే జరుగుతోంది. 

News January 18, 2025

RR: రైతు భరోసా సర్వే.. టార్గెట్-20

image

RR, MDCL, VKB జిల్లాల వ్యాప్తంగా రైతు భరోసా పథకం అమలు చేసేందుకు ప్రభుత్వ వ్యవసాయ, రెవెన్యూ అధికారులు గ్రామ గ్రామాల్లో తిరుగుతూ సర్వే నిర్వహిస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. జనవరి 20 తేదీ నాటికి సర్వేను పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న దరఖాస్తు దారులను సైతం కలిసి వివరాలు సేకరిస్తున్నారు.