News March 13, 2025
HYDను దేశ 2వ రాజధాని చేయాలని డిమాండ్

పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాదికి తీరని అన్యాయం జరుగుతుందని VCK రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ ఆరోపించారు. ఆయన అధ్యక్షతన బుధవారం బాగ్లింగంపల్లిలోని SVKలో ‘దక్షిణాది పార్లమెంటు సీట్లు పెంపు-దక్షిణాది హక్కు’ పై వివిధ పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దక్షిణాదికి ప్రత్యేక బడ్జెట్ను కేటాయించాలని, HYDను దేశానికి 2వ రాజధానిగా చేయాలని వక్తలు డిమాండ్ చేశారు. దీనిపై మీ కామెంట్?
Similar News
News November 11, 2025
అన్ని దేశాల టెకీలకు స్వర్గధామం మన HYD

చైనా, జపాన్, రష్యా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, న్యూజిలాండ్, యునైటెడ్ కింగ్డమ్ సహా అనేక దేశాల టెకీలకు అనువైన ప్రాంతాల జాబితాలో HYD నిలిచింది. ఇతర దేశాల టెక్నికల్ ఇంజినీర్లు సైతం HYDకి ట్రాన్స్ఫర్ పెట్టుకుని, అద్భుతమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నట్లుగా UK టీకి అశ్విన్రాజ పవన్ తెలిపారు. ఇతర దేశాలతో పోల్చితే HYDలో తక్కువ ఖర్చుతో, ఆనందంగా బతకడం చాలా ఈజీ అని చెప్పుకొచ్చారు.
News November 11, 2025
జూబ్లీహిల్స్ బైపోల్: 1PM UPDATE.. 31.94% పోలింగ్ నమోదు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 31.94% పోలింగ్ నమోదు అయ్యింది. సాయంత్రం 6 గంటలకు క్యూ లైన్లో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించనున్నారు. 2023 సాధారణ ఎన్నికల కంటే ఈసారి ఓటింగ్ శాతం అధికంగా నమోదు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా ఓటు వేయని వారు ఉంటే మీ అమూల్యమైన హక్కును వినియోగించుకోండి.
News November 11, 2025
జూబ్లీహిల్స్ బైపోల్: ‘నేను ఓటు వేశాను.. మరి మీరు?’

జూబ్లీహిల్స్ బైపోల్లో ఓటు వేసేందుకు యువత ఆసక్తి చూపిస్తోంది. యూసుఫ్గూడలోని పలు పోలింగ్ బూత్లలో యువ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటేసిన అనంతరం బయటకు వచ్చి ఫొటోలు దిగుతూ ఆనందం వ్యక్తం చేశారు. ‘నేను ఓటు వేశాను.. మరి మీరు’ అంటూ స్నేహితులకు సందేశం పంపుతున్నారు. యువత.. మీరూ కొంచెం ఆలోచించండి. ఓటు వేసి SMలో ఒక పోస్ట్ పెట్టండి. ఇంకా ఓటు వేయనివారిని పోలింగ్కు తీసుకెళ్లండి.


