News March 21, 2025

HYDలో అడవిని సృష్టించలేం.. కానీ..!

image

మన HYDలో అడవిని సృష్టించలేము. కానీ, ప్రయత్నం చేద్దాం. ‘రాజధాని’ కాంక్రిట్ జంగిల్‌‌గా మారడంతో గల్లీ గల్లీకి సీసీ రోడ్డు వస్తున్నాయే తప్పా.. ఓ మొక్క నాటడానికి జాగ దొరుక్తలేదు. హరితహారం, వన మహోత్సవం అంటూ ప్రభుత్వాలు గొప్ప పనే చేస్తున్నాయి. కానీ, సామాజిక బాధ్యతగా చెట్లను రక్షించాల్సిన మనం ఏం చేస్తున్నాం? అసలే ఎండకాలం. నీడనిచ్చే చెట్లను కాపాడుకుందాం.
నేడు ప్రపంచ అటవీ దినోత్సవం.
SAVE TREES.

Similar News

News December 6, 2025

US అగ్నిప్రమాదం.. మృతులు హైదరాబాదీలే!

image

అమెరికాలో అగ్నిప్రమాద <<18481815>>ఘటనలో<<>> మరణించిన ఇద్దరు హైదరాబాదీలేనని తెలుస్తోంది. HYD జోడిమెట్ల సమీపంలోని శ్రీనివాసకాలనీలో నివాసముండే సహజారెడ్డి(24) ఉన్నత విద్య కోసం నాలుగేళ్ల క్రితమే USకు వెళ్లింది. నిన్న ప్రమాదంలో మరణించిందని అధికారులు చెప్పడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఆమె తండ్రి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కాగా తల్లి ప్రభుత్వ ఉద్యోగి. మరో విద్యార్థి కూకట్ పల్లికి చెందిన వ్యక్తి అని సమాచారం.

News December 6, 2025

NGKL: ప్రజాస్వామ్యం అంటే మోదీకి విలువలేదు: ఎంపీ

image

ప్రజాస్వామ్యం అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విలువలేదని నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి అన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన సందర్భంగా లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు అయిన రాహుల్ గాంధీ, మల్లికార్జున కార్గేను ఆహ్వానించకపోవడం ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయ విలువలను పక్కనపెట్టి ఏకపక్షంగా ముందుకు సాగుతున్నారని మండిపడ్డారు.

News December 6, 2025

రాజన్న సిరిసిల్ల: 21న లోక్ అదాలత్

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రజలందరూ ఈ నెల 21న జరిగే లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకొని, పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించుకోవాలని ఇన్‌ఛార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికర సంస్థ అధ్యక్షురాలు పుష్పలత సూచించారు. శనివారం జిల్లా కోర్టు సముదాయంలో జిల్లాకు చెందిన న్యాయమూర్తులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, పోలీసు అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.