News July 14, 2024
HYDలో అప్రమత్తంగా ఉండాలని మేయర్ ఆదేశాలు

నగరంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జోనల్ కమిషనర్లు, EVDM టీమ్లతో మేయర్ గద్వాల విజయ లక్ష్మి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నాళాల వద్ద ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈదురుగాలులు వీస్తున్న నేపథ్యంలో చెట్లు విరిగే ప్రమాదం ఉందన్నారు. ముఖ్యంగా ఈవీడీఎం సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు.
Similar News
News November 4, 2025
వారంలో 3-5 ప్రమాదాలు..నిర్లక్ష్యపు నిద్రలోనే అధికారులు

నిన్న ప్రమాదం జరిగి 19 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన ప్రజలను కలచివేస్తోంది. ప్రమాదం జరిగిన ఈ రోడ్డుపై (హైదరాబాద్-బీజాపూర్ రోడ్డు) వారానికి 3 నుంచి 5 ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాలకు కనిపించడం లేదు. ఏదైనా ప్రమాదం జరిగితే తప్ప స్పందించని పాలకులు, అధికారులు ఉన్నంతవరకు ప్రజలు ఇలా ప్రాణాలు కోల్పోవాల్సిందేనా?
News November 4, 2025
HYD: ఆపండయ్యా మీ రాజకీయం.. ‘ఆడ’పిల్లలను ఆదుకోండి!

మీర్జాగూడ ఘటనపై నేతల హంగామా తీవ్ర విమర్శలకు దారి తీసింది. మృతదేహాల మధ్య హైవే సాంక్షన్ చేశామని ఒకరు, నిధులు మంజూరు చేశామని మరొకరు, పనులు మొదలుపెట్టిందే మేమని ఇంకొకరు గొప్పలు చెప్పుకున్నారు. ‘ఎంత చెప్పినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ పేద కుటుంబం పెద్దలను కోల్పోయింది. ఆడపిల్లలు రోడ్డున పడ్డారు. గతాన్ని మార్చలేము. యాలాలలోని హాజీపూర్లో అనాథలైన <<18187789>>భవానీ, శివాలీ<<>>ని ఆదుకోండి’ అంటూ ప్రజలు కోరుతున్నారు.
News November 4, 2025
గచ్చిబౌలి: కో-లివింగ్లో RAIDS.. 12 మంది అరెస్ట్

గచ్చిబౌలి TNGOకాలనీలోని కో-లివింగ్ రూమ్స్లో పోలీసులు మెరుపుదాడులు చేశారు. డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న 12 మందిని SOT పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక నుంచి డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తోన్న గుత్తా తేజతో పాటు మరో నైజీరియన్ హైదరాబాద్ యువతకు అమ్ముతున్నట్లు గుర్తించారు. ఈ రైడ్స్లో ఆరుగురు డ్రగ్ పెడ్లర్స్, ఆరుగురు కన్జ్యూమర్స్ను అదుపులోకి తీసుకున్నారు. MDMAతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.


