News March 10, 2025

HYDలో ఇవి ఇప్పుడు తప్పనిసరి

image

ఉష్ణోగ్రతలు అమాంతం పెరుగుతుండడంతో వైద్యులు ప్రజలకు పలు సూచనలు చేశారు.
– నీళ్లు, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు ద్రవదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.
– బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపీ, రుమాలు, తలపాగా ధరించాలి.
– రోడ్లపై అమ్మే వేడి పదార్థాలను తినడం తగ్గించాలి.
– దోస, పుచ్చ, తాటి ముంజలతో పాటు తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి.
– ఎండలో చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణిలు తిరగకూడదు.

Similar News

News March 27, 2025

IPL మ్యాచ్ చూడడానికి ఇవి తీసుకెళ్లకండి..!

image

వాటర్ బాటిల్స్ కెమెరాస్ IPL క్రికెట్ మ్యాచ్ చూడడానికి స్టేడియానికి వెళ్లే ప్రేక్షకుల కోసం రాచకొండ పోలీసులు కీలక సూచనలు చేశారు. మ్యాచ్ చూడడానికి వెళ్లే వారు ఎలాంటి వస్తువులను తీసుకెళ్లద్దని తెలిపారు. స్టేడియం వద్ద వస్తువులు నిలువ చేసుకోవడానికి CLOAKROOM ఉండవని తెలిపారు. ఏ వస్తువులు తీసుకెళ్లకూడదో ఒక జాబితా విడుదల చేశారు. కెమెరా, సిగరెట్స్, స్నాక్స్, బ్యాగ్స్, పెట్స్ తదితరాలపై నిషేదం ఉంటుంది.

News March 27, 2025

రంగారెడ్డి జిల్లా వెదర్ UPDATE

image

రంగారెడ్డి జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. బుధవారం తాళ్లపల్లిలో 39.5℃, మాడ్గుల్ 39.4, రాజేంద్రనగర్, కాసులాబాద్ 39.3, ఎలిమినేడు, కందువాడ, తట్టిఅన్నారం 39.2, చుక్కాపూర్, చందనవల్లి, కొందుర్గ్, మంగళపల్లె, కడ్తాల్, యాచారం 39.1, మామిడిపల్లి 39, మీర్‌ఖాన్‌పేట, దండుమైలారం, రెడ్డిపల్లె 38.9, ఆమన్‌గల్, మొగలిగిద్ద, కేశంపేట, షాబాద్ 38.8, గున్గల్, HCU 38.7, ఇబ్రహీంపట్నంలో 38.6℃ ఉష్ణోగ్రత నమోదైంది.

News March 27, 2025

HYD: పెరుగుతున్న ట్యాంకర్ల పెండెన్సీ

image

HYDలో జలమండలి ట్యాంకర్ల పెండెన్సీ నానాటికి పెరిగుతోంది. జలమండలి పరిధిలో 75 ఫీలింగ్ స్టేషన్లు ఉండగా.. 20 స్టేషన్లు మినహా మిగతా వాటిలో 24 నుంచి 48 గంటలు దాటితే కానీ ట్యాంకర్లు డెలివరీ కానీ పరిస్థితి నెలకొంది. ఎల్లారెడ్డిగూడ, షాపూర్‌నగర్, గచ్చిబౌలి-2, మణికొండ, ఫతేనగర్‌లతోపాటు మిగతా ఫిల్లింగ్ స్టేషన్లలో డెలివరీకి 2, 3 రోజులు పడుతుందని జలమండలి నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

error: Content is protected !!