News November 30, 2024
HYDలో ఈ రోజే చివరి అవకాశం: HMWSSB

HYDలో పెండింగ్లో ఉన్న నీటి బిల్లుల చెల్లింపునకు వన్ టైమ్ సెటిల్ మెంట్-2024 పథకం నేటితో ముగియనుంది. బిల్లు మొత్తం కడితే ఎలాంటి వడ్డీ, ఆలస్య రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. గడువు పూర్తయిన తర్వాత చెల్లిస్తే వడ్డీతో పాటు పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. లేనిపక్షంలో రేపటి నుంచి చర్యలు తీసుకుంటామని HMWSSB ట్వీట్ చేసింది. అవసరమైతే నల్లా కనెక్షన్ సైతం తొలగిస్తాని స్పష్టం చేసింది.
SHARE IT
Similar News
News October 21, 2025
HYD: సచివాలయానికి ‘కవచం’..!

HYD Dr.BR.అంబేడ్కర్ సచివాలయానికి వచ్చే ప్రతి సామాన్య పౌరుడి నుంచి సీఎం వరకు మానవ ప్రాణాల రక్షణే ఇప్పుడు అతిపెద్ద సవాల్గా మారింది. ఇటీవల డ్రోన్లు చక్కర్లు కొట్టడం, నకిలీ ఉద్యోగులు చొరబడటం వంటి ఘటనలతో భద్రతా వలయంపై ఆందోళన నెలకొంది. దీంతో కోట్ల మంది నమ్మకాన్ని నిలబెట్టేందుకు, ప్రమాదాలను తొలిపొరలోనే అడ్డుకునేందుకు ఎక్స్-రే స్కానర్ వ్యవస్థ (X-ray BSS)నిర్వహణకు ప్రభుత్వం రూ.15,95,360 ఖర్చు చేస్తోంది.
News October 21, 2025
KTR, హరీశ్ ‘హైదరాబాద్ యాత్ర’..!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలవాలనే లక్ష్యంతో KTR, హరీశ్రావు రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారు. నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను హైలైట్ చేయడానికి ఇద్దరు నాయకులు ‘హైదరాబాద్ యాత్ర’లో ఉన్నారు. HYDRAA, Musi ప్రాజెక్టు ప్రభావిత కుటుంబాలతో దీపావళిని జరుపుకున్న తర్వాత KTR, హరీశ్ ఈరోజు బస్తీ దవాఖానలను సందర్శించారు. 2026 ప్రారంభంలో GHMC ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున వారు సిటీపై మరింత ఫోకస్ పెట్టారు.
News October 21, 2025
HYDలో మహిళా శక్తికి రూ. 57 కోట్లతో నాలుగు హాస్టళ్లు!

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మహిళా శక్తి ప్రాజెక్ట్ మహిళల ఆశలకు ఊపిరి పోస్తోంది. రూ. 57,56,31,404 అంచనా వ్యయంతో HYDలోని ఖైరతాబాద్, షేక్పేట్, ఆసిఫ్నగర్లో 4 అత్యాధునిక వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లను నిర్మించనుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చి నగరంలో ఉద్యోగాలు చేసుకునే మహిళలకు ఇవి భరోసా కల్పించనున్నాయి. సురక్షిత, సౌకర్యవంతమైన వసతి కల్పించనున్నారు. త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.