News November 30, 2024
HYDలో ఈ రోజే చివరి అవకాశం: HMWSSB

HYDలో పెండింగ్లో ఉన్న నీటి బిల్లుల చెల్లింపునకు వన్ టైమ్ సెటిల్ మెంట్-2024 పథకం నేటితో ముగియనుంది. బిల్లు మొత్తం కడితే ఎలాంటి వడ్డీ, ఆలస్య రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. గడువు పూర్తయిన తర్వాత చెల్లిస్తే వడ్డీతో పాటు పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. లేనిపక్షంలో రేపటి నుంచి చర్యలు తీసుకుంటామని HMWSSB ట్వీట్ చేసింది. అవసరమైతే నల్లా కనెక్షన్ సైతం తొలగిస్తాని స్పష్టం చేసింది.
SHARE IT
Similar News
News December 1, 2025
HYD: రాజ్ భవన్.. లోక్ భవన్గా మారనుందా?

సోమాజిగూడలోని గవర్నర్ అధికారిక నివాసం రాజ్ భవన్ ఇకనుంచి లోక్భవన్గా మారే అవకాశం ఉంది. గవర్నర్లు నివాసం ఉంటున్న రాజ్భవన్ పేరును లోక్భవన్గా కేంద్రం మార్చాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అధికారికంగా ఆదేశాలు ఇవ్వకపోయినా.. కేంద్రం సూచనల మేరకు ఇప్పటికే తమిళనాడు, పశ్చిమబెంగాల్లోని రాజ్భవన్లు లోక్భవన్గా మారాయి. ఈ క్రమంలో మన రాజ్భవన్ కూడా పేరు మారుతుందా అనే చర్చ సాగుతోంది.
News December 1, 2025
గచ్చిబౌలి ఐటీ కారిడార్లో వాహనదారులు అవస్థలు

గచ్చిబౌలి ఐటీ కారిడార్లో వాహనదారులకు అవస్థలు తప్పడం లేదు. మూడు లైన్ల రోడ్లు ఉన్నా సరే నిత్యం సమస్యలు ఎదుర్కొంటున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు పని దినాలు ఉండటంతో ఆ సమయాల్లో ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది. తమ విలువైన సమయాన్ని ట్రాఫిక్లోనే పోగొట్టుకుంటున్నామని సాఫ్ట్వేర్ ఇంజినీర్లు బాధ పడుతున్నారు. ఇటు కంపెనీలు, అటు ప్రభుత్వం దృష్టి సారిస్తే ఇబ్బందులు తొలగుతాయని భావిస్తున్నారు.
News December 1, 2025
గ్లోబల్ సిటీగా మారనున్న హైదరాబాద్

గ్రేటర్ హైదరాబాద్ త్వరలోనే గ్లోబల్ సిటీగా మారనుంది. ఓఆర్ఆర్ పరిధిలోని మున్సిపాలిటీలను విలీనం చేసిన నేపథ్యంలో ఈ ఘనత సాధించనుంది. జనాభా పరంగా ఇప్పటికే 1.85 కోట్లకి చేరుకుంది. మున్సిపాలిటీల విలీనంతో మరింత జనాభా పెరగనుంది. జనాభాకు తగ్గట్టుగా వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. జనాభాతో పాటుగా అభివృద్ధిలోను గ్రేటర్ హైదరాబాద్ దూసుకెళ్లనుంది.


