News January 28, 2025

HYDలో ఒకే వాహనానికి 3 నంబర్ ప్లేట్‌లు

image

ఒకే వాహనానికి 3 నంబర్ ప్లేట్‌లు బిగించి HYDలో అడ్డంగా దొరికిపోయారు. సోమవారం సాయంత్రం నాగోల్‌లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. UP నుంచి HYD వస్తున్న ఓ వెహికిల్‌ను ఆపి చెక్ చేశారు. UP, AP, తెలంగాణ స్టేట్‌లకు చెందిన 3 నంబర్ ప్లేట్లు ఒకదానిపై ఒకటి ఉన్నట్లు గుర్తించారు. సదరు వాహనాన్ని సీజ్ చేసి నాగోల్ డ్రైవింగ్ ట్రాక్ ప్రాంతానికి తరలించినట్లు వెహికల్ ఇన్‌స్పెక్టర్ రవీందర్ రెడ్డి వెల్లడించారు.

Similar News

News December 16, 2025

BREAKING: కామారెడ్డి జిల్లాలో విషాదం

image

కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన జంగం మహేశ్వరి(30) అనే వివాహిత మంగళవారం తన ఇంట్లో ఉరేసుకుని చనిపోయిందని కుటుంబసభ్యులు, గ్రామస్థులు తెలిపారు. సీఏగా విధులు నిర్వహిస్తున్న మహేశ్వరి మధ్యాహ్నం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందన్నారు. కాగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఎస్ఐ ఆంజనేయులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, వివరాలు సేకరించారు.

News December 16, 2025

వాహనదారులు జాగ్రత్త: ఎస్పీ నరసింహ

image

రాబోయే రెండు, మూడు రోజులు రాష్ట్రంలో కోల్డ్ వేవ్స్, దట్టమైన పొగమంచు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఎస్పీ నరసింహ ప్రజలను అప్రమత్తం చేశారు. తెల్లవారుజామున ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, హైవేలపై డ్రైవ్ చేసేవారు తక్కువ వేగంతో, మంచి లైటింగ్, ఇండికేటర్లతో ఒకే లైన్‌లో వెళ్లాలని సూచించారు. రోడ్డు భద్రత పాటించి, సురక్షితంగా గమ్యం చేరుకోవాలని కోరారు.

News December 16, 2025

‘గత ఐదేళ్లలో ఏపీకి రూ.112.67 కోట్లు మాత్రమే విడుదల’

image

దీనదయాళ్ దివ్యాంగజన పునరావాస పథకం (DDRS) కింద ఆంధ్రప్రదేశ్‌కు గత ఐదేళ్లలో రూ.112.67 కోట్ల నిధులు విడుదల చేసినట్లు కేంద్ర మంత్రి బి.ఎల్.వర్మ తెలిపారు. 241 స్వచ్ఛంద సంస్థల ద్వారా 25,534 మంది దివ్యాంగులు లబ్ధి పొందారని చెప్పారు. లోక్‌సభలో ఎంపీ కేశినేని శివనాథ్ ప్రశ్నకు సమాధానంగా, దివ్యాంగుల పునరావాసం, విద్య, నైపుణ్యాభివృద్ధి కోసం ఈ పథకం కొనసాగుతోందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.