News March 28, 2025

HYDలో గ్రీన్ బిల్డింగ్.. పెరుగుతున్న ఆసక్తి..!

image

HYDలో గ్రీన్ బిల్డింగ్స్ వైపు ప్రజల ఆసక్తి పెరుగుతుంది. దీంతో ముఖ్యంగా కోకాపేట, హైటెక్ సిటీ, చందానగర్, పటాన్‌చెరు ప్రాంతాల్లో సివిల్ ఇంజినీర్లు గ్రీన్ బిల్డింగ్స్ డిజైన్స్ అమలు చేస్తున్నారు. వీటితో కరెంటు ఆదా, అనుకూల వాతావరణం, గ్రీనరీ, గుడ్ లుకింగ్ ఆర్కిటెక్చర్, వర్షపు నీటి వినియోగం, వాటర్ రీసైకిల్ చేసి మొక్కలకు అందించడం, గాలి నాణ్యత సైతం బాగుంటుందని ఇంజినీర్లు తెలిపారు.

Similar News

News November 18, 2025

ఐ-బొమ్మ రవిని ఎన్‌కౌంటర్ చేయాలి.. నిర్మాత డిమాండ్

image

ఐ-బొమ్మ రవిని ఎన్‌కౌంటర్ చేయాలంటూ నిర్మాత సి.కళ్యాణ్ హాట్ కామెంట్స్ చేశారు. పోలీసులు కాకపోయినా సినిమా వాళ్లైనా చేయాలంటూ ఫిల్మ్ ఛాంబర్ నిర్వహించిన ప్రెస్‌మీట్లో వ్యాఖ్యానించారు. అలా జరిగితేనే ఇలాంటి పనులు చేయాలంటే మరొకరు భయపడతారని తెలిపారు. తాను కడుపు మంటతో, బాధతో ఈ కామెంట్స్ చేస్తున్నట్లు చెప్పారు. కాగా సి.కళ్యాణ్ కామెంట్స్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి మీ COMMENT?

News November 18, 2025

రైతు అభివృద్ధే లక్ష్యం: మార్నేని రవీందర్

image

హనుమకొండ డీసీసీబీ బ్యాంకులో 72వ అఖిల భారత సహకార వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ స్నేహ శబరీష్, అపెక్స్ బ్యాంక్ ఛైర్మన్ మార్నేని రవీందర్ రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్యాక్స్(PACS) లను సాధారణ సేవా కేంద్రాలుగా అభివృద్ధి చేసి, గ్రామీణ ప్రజలకు స్థిర జీవనోపాధి కల్పించడమే సహకార రంగం లక్ష్యమని వారు పేర్కొన్నారు.

News November 18, 2025

ఖైదీని మార్చిన పుస్తకం!

image

మనిషి జీవితంపై పుస్తకాలు ఎంత ప్రభావం చూపుతాయో తెలిపే ఘటనే ఇది. అమెరికాకు చెందిన రెజినాల్డ్ డ్వైన్ బెట్స్ 17 ఏళ్ల వయసులో కార్ జాకింగ్ కేసులో జైలుపాలయ్యారు. ఏకాంత కారాగారంలో ఆయన ‘ది బ్లాక్ పోయెట్స్’ పుస్తకం చదివి స్ఫూర్తిపొందారు. 2020లో ఆయన ‘ఫ్రీడమ్ రీడ్స్’ అనే సంస్థను స్థాపించి అమెరికాలోని జైళ్లలో లైబ్రరీలను ఏర్పాటు చేస్తున్నారు. అలా 500 పుస్తకాలతో కూడిన 35 కొత్త లైబ్రరీలను ప్రారంభించారు.