News March 28, 2025

HYDలో గ్రీన్ బిల్డింగ్.. పెరుగుతున్న ఆసక్తి..!

image

HYDలో గ్రీన్ బిల్డింగ్స్ వైపు ప్రజల ఆసక్తి పెరుగుతుంది. దీంతో ముఖ్యంగా కోకాపేట, హైటెక్ సిటీ, చందానగర్, పటాన్‌చెరు ప్రాంతాల్లో సివిల్ ఇంజినీర్లు గ్రీన్ బిల్డింగ్స్ డిజైన్స్ అమలు చేస్తున్నారు. వీటితో కరెంటు ఆదా, అనుకూల వాతావరణం, గ్రీనరీ, గుడ్ లుకింగ్ ఆర్కిటెక్చర్, వర్షపు నీటి వినియోగం, వాటర్ రీసైకిల్ చేసి మొక్కలకు అందించడం, గాలి నాణ్యత సైతం బాగుంటుందని ఇంజినీర్లు తెలిపారు.

Similar News

News December 6, 2025

VJA-HYD విమాన ఛార్జీల పెంపు.. కారణమిదే.!

image

ఇండిగో సహా పలు సర్వీసులు రద్దు కావడంతో విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ఎయిర్‌లైన్స్ ఆన్‌లైన్‌లో టికెట్ ధరలు ఏకంగా రూ. 17 వేల నుంచి రూ. 60 వేల వరకు చూపిస్తున్నాయి. ఈ అధిక ధరలపై ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు జోక్యం చేసుకుని టికెట్ రేట్లు తగ్గించాలని కోరుతున్నారు.

News December 6, 2025

శభాష్.. తల్లికి పునర్జన్మనిచ్చాడు

image

AP: విద్యుత్ షాక్‌తో కొట్టుమిట్టాడుతున్న తల్లి ప్రాణాలను సమయస్ఫూర్తితో కాపాడుకున్నాడో ఐదో తరగతి బాలుడు. ఈ ఘటన ప.గో(D) జొన్నలగరువులో జరిగింది. నిన్న మెగా PTMకు వస్తానన్న తల్లి ఎంతకీ రాకపోవడంతో కొడుకు దీక్షిత్ ఇంటికి వెళ్లగా ఆమె కరెంట్ షాక్‌తో విలవిల్లాడుతూ కనిపించింది. కొడుకు భయపడకుండా స్విచ్ ఆఫ్ చేసి, కరెంటు తీగను తీసేసి ఆస్పత్రికి తీసుకెళ్లాడు. దీంతో పిల్లాడి ధైర్యాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.

News December 6, 2025

చంద్రబాబూ.. గంగిరెద్దులా తలూపొద్దు: అనంత వెంకటరామిరెడ్డి

image

రైతాంగాన్ని ఆదుకునే విషయంలో కేంద్రంతో పోరాడాల్సిన చంద్రబాబు.. రైతులను పణంగా పెట్టి తన పాత కేసులను మాఫీ చేసుకుంటున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉందంటే అది ఇక్కడి ఎంపీల వల్లేనని గుర్తు చేశారు. ఒక్క వార్నింగ్‌ ఇస్తే కేంద్రం దిగి వస్తుందని, కానీ చంద్రబాబు మాత్రం తన స్వప్రయోజనాల కోసం కేంద్రం వద్ద గంగిరెద్దులా తలూపుతున్నారని మండిపడ్డారు.