News March 28, 2025
HYDలో గ్రీన్ బిల్డింగ్.. పెరుగుతున్న ఆసక్తి..!

HYDలో గ్రీన్ బిల్డింగ్స్ వైపు ప్రజల ఆసక్తి పెరుగుతుంది. దీంతో ముఖ్యంగా కోకాపేట, హైటెక్ సిటీ, చందానగర్, పటాన్చెరు ప్రాంతాల్లో సివిల్ ఇంజినీర్లు గ్రీన్ బిల్డింగ్స్ డిజైన్స్ అమలు చేస్తున్నారు. వీటితో కరెంటు ఆదా, అనుకూల వాతావరణం, గ్రీనరీ, గుడ్ లుకింగ్ ఆర్కిటెక్చర్, వర్షపు నీటి వినియోగం, వాటర్ రీసైకిల్ చేసి మొక్కలకు అందించడం, గాలి నాణ్యత సైతం బాగుంటుందని ఇంజినీర్లు తెలిపారు.
Similar News
News December 2, 2025
టికెట్ ధరల పెంపు.. నెటిజన్ల ఆగ్రహం!

APలో ‘అఖండ-2’ సినిమా టికెట్ ధరల <<18450771>>పెంపునకు<<>> ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాక్టర్ల రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ ఖర్చులు పెంచుకుని ఇలా ప్రేక్షకులపై భారం మోపడం కరెక్ట్ కాదని అంటున్నారు. రేట్లు పెంచితే సాధారణ ప్రేక్షకులు థియేటర్లకు ఎందుకు వస్తారని ప్రశ్నిస్తున్నారు. అందుకే ఐబొమ్మ రవి లాంటి వారిని ఎంకరేజ్ చేయాల్సి వస్తోందంటున్నారు. దీనిపై మీ కామెంట్?
News December 2, 2025
సంగారెడ్డి: రేపు కలెక్టరేట్లో దివ్యాంగుల దినోత్సవం

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆడిటోరియంలో ఈనెల 3న అంతర్జాతీయ దివ్యంగుల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి మంగళవారం తెలిపారు. ఇటీవల నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన దివ్యాంగులకు బహుమతులు అందిస్తామని చెప్పారు. కలెక్టర్ ప్రావీణ్య ముఖ్యఅతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు. దివ్యాంగులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.
News December 2, 2025
కర్నూలు రోడ్డు ప్రమాదం.. మృతుల వివరాలివే.!

కర్నూలు హైవే-44 సంతోశ్ నగర్ ఫ్లైఓవర్ వద్ద మంగళవారం <<18451272>>ఘోర రోడ్డు ప్రమాదం<<>> చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కాగా అక్కడ మృతి చెందినవారి వివరాలను పోలీసులు తెలిపారు. మృతులు గూడూరుకి చెందిన మాలకమతల చంద్రమోహన్(32), మాల సుమన్(30)గా పోలీసులు గుర్తించారు. కాగా గాయపడిన మాల నవీన్ (33)ది ఎమ్మిగనూరు. అయితే వీరు కూలీ పనులతో జీవనం సాగించేవారని కుటుంబసభ్యులు తెలిపారు.


