News February 16, 2025

HYDలో చికెన్ తింటున్నారా.. జాగ్రత్త!

image

HYDలో చికెన్ ప్రియులకు అలర్ట్. నగరంలో ఇటీవల కల్తీ చికెన్‌ను గుర్తించిన పోలీసులు ప్రజలకు పలు సూచనలు చేశారు.
➢చికెన్ నాణ్యత విషయంలో జాగ్రత్త.
➢ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో చికెన్ ఆర్డర్ చేయడానికి ముందు తనిఖీ చేయండి.
➢వైన్ షాపుల పక్కనే విక్రయించే మాంసం విషయంలో మరింత జాగ్రత్త అవసరం.
➢చికెన్ విక్రయదారులపై అనుమానం వస్తే వెంటనే 100కు డయల్ చేయండి.
SHARE IT

Similar News

News November 26, 2025

HYD: ఎందుకీ విలీనం.. ప్రజలకేం ప్రయోజనం!

image

నగరం చుట్టూ ఉన్న 27 మున్సిపాల్టీలను GHMCలో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో ఈ ప్రక్రియ ముగియనుంది. అయితే ఈ విలీనం వల్ల ప్రజలకేం ప్రయోజనం? అని సామాన్యుల మదిలో మెదిలో ప్రశ్న. గతేడాది గ్రామాలను మున్సిపాలకటీల్లో కలిపిన సర్కారు.. ఇపుడు మున్సిపాలిటీలను గ్రేటర్‌లో కలపాలని నిర్ణయించింది. మా పల్లెలను GHMCలో కలిపితే మాకు వచ్చే ప్రయోజనం ఏమిటి? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

News November 26, 2025

గ్లోబల్ సమ్మిట్: పెట్టుబడిదారుల దృష్టికి సౌకర్యాల జాబితా

image

డిసెంబర్ 8, 9 తేదీల్లో పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలనూ చేస్తోంది. ముఖ్యంగా ఇక్కడ సర్కారు కల్పించనున్న సౌకర్యాలను వారికి కూలంకుషంగా వివరించనుంది. ORR, RRR, IRR, గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి, బందర్ పోర్టు వరకు మార్గం, కొత్తగా నిర్మించే రైలు మార్గాలు తదితరాలను వారికి అర్థమయ్యేలా ప్రొజెక్ట్ చేయనుంది. ఎప్పుడూ.. ఎక్కడా.. ఎలాంటి సమస్యలు రానివ్వబోమని కచ్చితమైన హామీ ఇవ్వనుంది.

News November 26, 2025

BIG BREAKING: HYDలో బోర్డు తిప్పేసిన IT కంపెనీ

image

హైదరాబాద్‌లో మరో ఐటీ కంపెనీ ఘరానా మోసం బయటపడింది. మాదాపూర్‌లోని NSN ఇన్ఫోటెక్‌లో శిక్షణ–ఉద్యోగం పేరుతో రూ. లక్షల్లో వసూలు చేశారు. 400 మందిలో ఒక్కొక్కరి నుంచి రూ.2 నుంచి 3 లక్షల వరకు వసూళ్లు చేసి, చివరకు బోర్డు తిప్పేసినట్లు బాధితులు వాపోయారు. కంపెనీ నిర్వాహకుడు పరారీలో ఉన్నాడు. బాధితులు మాదాపూర్ PS, సైబరాబాద్ EOWలో ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.