News February 16, 2025

HYDలో చికెన్ తింటున్నారా.. జాగ్రత్త!

image

HYDలో చికెన్ ప్రియులకు అలర్ట్. నగరంలో ఇటీవల కల్తీ చికెన్‌ను గుర్తించిన పోలీసులు ప్రజలకు పలు సూచనలు చేశారు.
➢చికెన్ నాణ్యత విషయంలో జాగ్రత్త.
➢ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో చికెన్ ఆర్డర్ చేయడానికి ముందు తనిఖీ చేయండి.
➢వైన్ షాపుల పక్కనే విక్రయించే మాంసం విషయంలో మరింత జాగ్రత్త అవసరం.
➢చికెన్ విక్రయదారులపై అనుమానం వస్తే వెంటనే 100కు డయల్ చేయండి.
SHARE IT

Similar News

News October 19, 2025

కరీంనగర్: కానిస్టేబుల్‌ నుంచి డిప్యూటీ MRO వరకు

image

కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో మహిళా కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తోకల శైలుకిరణ్ తాజాగా విడుదలైన గ్రూప్–2 ఫలితాల్లో ప్రతిభ కనబరచి డిప్యూటీ MROగా ఎంపికయ్యారు. ఉద్యోగ బాధ్యతలతో పాటు కష్టపడి చదువుతూ లక్ష్యాన్ని చేరుకున్నారు. ప్రిపరేషన్ సమయంలో తండ్రి మరణించినా ధైర్యంగా చదువును కొనసాగించారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన కార్యక్రమంలో నియామకపత్రం అందుకున్నారు.

News October 19, 2025

WGL: ఆసక్తి గలవారు వేసేశారు.. మిగిలింది ఎవరు.?

image

ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే మద్యం వ్యాపారులు, కొత్తగా చేయాలనే వారు టెండర్ వేసేశారు. ఇక మిగిలింది ఎవరనే ప్రశ్న మొదలైంది. లైసెన్స్ దక్కించున్నాక వ్యాపారుల కష్టాలు అన్నీ ఇన్ని కావని చెబుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం రూ.3 లక్షల ఫీజు చేసింది. ఏడాది ఫీజులో నగరాలకు రూ.10 లక్షలకు పెంచింది. ఇక ఏడాదికి రూరల్‌కు రూ.5.50 కోట్లు, అర్బన్‌కు రూ.8.50 కోట్లు అమ్మితే 20 శాతం కోటా పూర్తయితే 10 శాతం కమీషన్ ఇస్తారు.

News October 19, 2025

రూ.కోటికి పైగా మోసపోయిన మైదుకూరు MLA..?

image

కడప జిల్లా మైదుకూరు MLA పుట్టా సుధాకర్‌ సైబర్ మోసానికి గురైనట్లు BBC సహా పలు పత్రికలు పేర్కొన్నాయి. ఆ కథనాల మేరకు.. ఈనెల 10వ తేదీ సైబర్ నేరగాళ్లు కాల్ చేసి మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు బెదిరించారు. వీడియో కాల్ చేసి డిజిటిల్ అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఈక్రమంలో ఎమ్మెల్యే 15వ తేదీ వరకు వివిధ దఫాలుగా రూ.1.07 కోట్లు పంపారు. కేసు క్లియరెన్స్‌కు మరికొంత అడగడంతో సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.