News September 14, 2024

HYDలో ట్రాఫిక్ ఆంక్షలు.. BIG ALERT

image

HYD సైబర్ టవర్స్ వద్ద సర్వీస్ రోడ్డు నిర్మిస్తుండటంతో SEP14 నుంచి 30 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ✓మాదాపూర్ కల్లు దుకాణం నుంచి JNTU, ముసాపేట వెళ్లే వారు 100 ఫీట్ జంక్షన్, పర్వత్‌నగర్ నుంచి కైతలాపుర్ బ్రిడ్జి మీదుగా వెళ్లాలని పోలీసులు తెలిపారు.
✓సైబర్ టవర్స్ వంతెన కింద నుంచి N-గార్డెన్ హోటల్ వద్ద లెఫ్ట్ టర్న్- N-కన్వెన్షన్- జైన్‌ఎంక్లేవ్ రైట్‌టర్న్- యశోద హాస్పిటల్ వైపు వెళ్లాలి.

Similar News

News September 15, 2025

‘10 లక్షల మంది విద్యార్థులతో HYDలో మహాధర్నా’

image

నేటి నుంచి ప్రైవేట్ కళాశాలలు నిరవదిక బంద్ చేయనున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించడం లేదని ప్రైవేటు వృత్తి విద్యా కళాశాలల యాజమాన్యాలు సమ్మె బాట పట్టాయి. ఈ నెల 21, 22న 10 లక్షల విద్యార్థులతో HYDలో మహాధర్నా చేపడతామని, దసరాలోపు రూ.1,200 కోట్ల బకాయిలు చెల్లిస్తేనే సమ్మె విరమిస్తానని విద్యా సంస్థల సంఘాల నాయకులు తేల్చి చెప్పారు.

News September 15, 2025

HYD: ORRపై యాక్సిడెంట్.. క్షతగాత్రలు వీరే!

image

సరళ మైసమ్మ ఆలయానికెళ్లి తిరిగి వస్తుండగా అబ్దుల్లాపూర్‌మెట్‌ PS పరిధి ORRపై <<17713246>>కారు ప్రమాదానికి<<>> గురైంది. సంగారెడ్డి జిల్లా జిన్నారంలోని వావిలాలకు చెందిన R.సౌమ్యరెడ్డి(25), స్నేహితులు నందకిషోర్, వీరేంద్ర, ప్రణీశ్, సాగర్, అరవింద్, జాన్సీ, శ్రుతితోపాటు మొత్తం 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సౌమ్యరెడ్డి, నందకిషోర్‌లను మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా సౌమ్య మరణించిందని CI అశోక్ రెడ్డి తెలిపారు.

News September 15, 2025

HYD: గొర్రెల స్కామ్‌‌ కేసు.. ED ముందుకు ఏపీ రైతులు

image

గొర్రెల స్కామ్ కేసులో ఈడీ స్పీడ్ పెంచింది. నేడే విచారణకు రావాలంటూ బాధితులకు నోటీసులు జారీ చేసింది. గొర్రెల స్కామ్‌లో మోసపోయామంటూ ఏపీకి చెందిన గొర్రెల కాపర్లు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. బాధితుల ఫిర్యాదు మేరకు ఈ నెల 15న విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతుండగా.. ఏసీబీ విచారణ ఆధారంగా ED ఎంటరైంది.