News September 14, 2024
HYDలో ట్రాఫిక్ ఆంక్షలు.. BIG ALERT

HYD సైబర్ టవర్స్ వద్ద సర్వీస్ రోడ్డు నిర్మిస్తుండటంతో SEP14 నుంచి 30 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ✓మాదాపూర్ కల్లు దుకాణం నుంచి JNTU, ముసాపేట వెళ్లే వారు 100 ఫీట్ జంక్షన్, పర్వత్నగర్ నుంచి కైతలాపుర్ బ్రిడ్జి మీదుగా వెళ్లాలని పోలీసులు తెలిపారు.
✓సైబర్ టవర్స్ వంతెన కింద నుంచి N-గార్డెన్ హోటల్ వద్ద లెఫ్ట్ టర్న్- N-కన్వెన్షన్- జైన్ఎంక్లేవ్ రైట్టర్న్- యశోద హాస్పిటల్ వైపు వెళ్లాలి.
Similar News
News November 26, 2025
శివారులో మాయమైపోతున్నయమ్మ పల్లెలు

దేశానికి పల్లెలే పట్టుగొమ్మలని పెద్దలు చెప్పేవారు.. అయితే ఇపుడు నగర శివారులో ఉన్న పల్లెలు మాయమవుతున్నాయి. అవి పట్నాలుగా కాదు.. ఏకంగా నగరంగా మారిపోతున్నాయి. సిటీ చుట్టుపక్కల ఉన్న పల్లెలు, మున్సిపాలిటీలను ప్రభుత్వం GHMCలో విలీనం చేస్తూనే ఉంది. అప్పట్లో 55 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణమున్న హైదరాబాద్ నగరం 2వేల చదరపు కిలోమీటర్లున్న నగరంగా మారుతోందంటే ఎన్ని పల్లెలు మాయమై ఉంటాయో ఆలోచించండి.
News November 26, 2025
HYD: లోకల్ బాడీల్లో BRS ‘డబుల్ స్ట్రాటజీ’

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓటమి తర్వాత, GP ఎలక్షన్స్లో గెలవడానికి BRS ప్రయత్నాలు మొదలెట్టింది. కాంగ్రెస్ పాలనలో GPలకు నిధుల కొరత, 42% BC కోటా అమలులో వైఫల్యాలని చెబుతూ ప్రచారంలో మెయిన్ ఎజెండాగా ప్లాన్ చేసింది. 2వ ఎజెండా ప్రభుత్వంలో అవినీతిని ఎత్తిచూపడం. KTR ఇప్పటికే ‘HILT’ పాలసీలో లక్షల కోట్ల స్కామ్ జరుగుతోందని లేవనెత్తారు. వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చింది.
News November 26, 2025
HYD: ఎందుకీ విలీనం.. ప్రజలకేం ప్రయోజనం!

నగరం చుట్టూ ఉన్న 27 మున్సిపాల్టీలను GHMCలో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో ఈ ప్రక్రియ ముగియనుంది. అయితే ఈ విలీనం వల్ల ప్రజలకేం ప్రయోజనం? అని సామాన్యుల మదిలో మెదిలో ప్రశ్న. గతేడాది గ్రామాలను మున్సిపాలకటీల్లో కలిపిన సర్కారు.. ఇపుడు మున్సిపాలిటీలను గ్రేటర్లో కలపాలని నిర్ణయించింది. మా పల్లెలను GHMCలో కలిపితే మాకు వచ్చే ప్రయోజనం ఏమిటి? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.


