News February 3, 2025

HYDలో త్రిష ట్రైనింగ్.. ఇదీ ఫలితం!

image

గొంగ‌డి త్రిష‌.. U-19 క్రికెట్‌లో ఈ పేరు ఓ సంచలనం. తన ప్రతిభతో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’గా నిలిచారు. ఇంతలా పేరు తెచ్చుకున్న ఆమె మన తెలంగాణ బిడ్డ అని గర్వంగా చెప్పుకుంటున్నారు. 2013లో భద్రాచలం నుంచి HYDకి వచ్చిన రామిరెడ్డి 7 ఏళ్ల త్రిషను సికింద్రాబాద్‌లోని సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడ‌మీలో చేర్చారు. రోజుకు 8 గంటలు ప్రాక్టీస్‌ చేసిన త్రిష నేడు తన ప్రదర్శనతో HYDలో బెస్ట్ ట్రైనింగ్ ఉందని నిరూపించారు.

Similar News

News November 20, 2025

ఇండియాకు 100 US జావెలిన్ మిస్సైళ్లు

image

దేశ రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. $92.8M విలువైన 100 FGM-148 జావెలిన్ క్షిపణులను, ఎక్స్‌కాలిబర్ ప్రొజెక్టైల్స్ అమ్మకానికి US ఆమోదం తెలిపింది. ముప్పులను సమర్థంగా ఎదుర్కొనేలా భారత రక్షణ రంగం పటిష్ఠం అవుతుందని US డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ వివరించింది. మిస్సైల్స్‌తో పాటు లాంచర్ యూనిట్లు, ఫిరంగి గుండ్లు అందుతాయి. మిస్సైల్‌ను భుజంపై మోస్తూ ఇద్దరు ఆపరేట్ చేయొచ్చు.

News November 20, 2025

నిజామాబాద్: దారుణం.. కన్న కూతురిపై తండ్రి అఘాయిత్యం

image

​నిజామాబాద్ జిల్లాలో అత్యంత హేయమైన ఘటన వెలుగు చూసింది. కన్న తండ్రే సొంత కూతురిపై లైంగిక దాడికి పాల్పడినట్లు నిందితుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఇటీవల అర్ధరాత్రి కూతురిపై తండ్రి లైంగిక దాడికి పాల్పడగా తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

News November 20, 2025

ఎక్స్‌ట్రీమ్‌ వెదర్‌తో 4,064 మంది మృతి

image

దేశంలో ప్రకృతి వైపరీత్యాలతో ఈ ఏడాది JAN-SEP వరకు 4,064 మంది మృత్యువాత పడినట్లు ఢిల్లీకి చెందిన ‘సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్మెంట్’ & ‘డౌన్‌ టు ఎర్త్‌’ నివేదిక వెల్లడించింది. గత 4 ఏళ్లతో పోలిస్తే మరణాలు 48% పెరిగినట్లు పేర్కొంది. 9.47 M హెక్టార్ల పంట నష్టం వాటిల్లింది. 2022తో పోలిస్తే 4 రెట్లు పెరిగింది. వ్యవసాయ రాష్ట్రాలైన AP, WBల సమాచారం అసమగ్రంగా ఉందని, నష్టం ఇంకా ఎక్కువే ఉండొచ్చంది.