News February 17, 2025
HYDలో నేడు డ్రింకింగ్ వాటర్ బంద్

గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్-1లో డయా వాల్వులు అమర్చుతున్నారు. ఈ కారణంగా SRనగర్, సనత్నగర్, జూబ్లీహిల్స్, కూకట్పల్లి, మూసాపేట, చింతల్, సుచిత్ర, అల్వాల్, చరపల్లి, మాదాపూర్, కొండాపూర్, జవహర్నగర్, దమ్మాయిగూడ, కొంపల్లి, గుండ్ల పోచంపల్లి, తూంకుంట, నాగారం, నిజాంపేట, బాచుపల్లి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ తదితర ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిపివేస్తున్నారు. రేపు ఉదయం వరకు సరఫరా ఉండదు.
SHARE IT
Similar News
News September 19, 2025
సరూర్నగర్ చెరువులో దూకి సూసైడ్

సరూర్నగర్ చెరువులో గృహిణి పోళ్ల భవాని (28) ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాలు, భర్త మద్యపాన అలవాటు కారణంగా విభేదాలు తీవ్రస్థాయికి నెలకొన్నాయి. ఈనెల 16న సైదాబాద్ మహిళా పోలీస్స్టేషన్లో కౌన్సెలింగ్ జరిగినా సమస్యలు తగ్గకపోవడంతో గురువారం సాయంత్రం చెరువులోకి దూకేసింది. మృతదేహం కోసం పోలీసులు, హైడ్రా టీమ్, ఫైర్ సిబ్బంది గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారని సీఐ సైదిరెడ్డి తెలిపారు.
News September 18, 2025
అమీర్పేటలో వాల్యూ జోన్ వచ్చేసింది!

నగరంలోని షాపింగ్ ప్రియులకు శుభవార్త. సిటీ నడిబొడ్డున ఉన్న అమీర్పేటలో వాల్యూ జోన్ వచ్చేసింది. 75,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రారంభించిన అతిపెద్ద షాపింగ్ మాల్ ఇది. ఈ దసరాకు ఇక్కడ ఫ్యాషన్, గ్రాసరీ, హోమ్ వేర్, వస్తు సామగ్రిపై ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. కుటుంబంలోని అన్ని తరాల వారిని దృష్టిలో పెట్టుకొని అమీర్పేటలో బ్రాంచ్ ఓపెన్ చేసినట్లు ఫౌండర్ శ్రీ పొట్టి వెంటటేశ్వర్లు తెలిపారు.
News September 18, 2025
BREAKING: మైసమ్మగూడ చెరువులో తండ్రి, కూతురు మృతి

మేడ్చల్ జిల్లాలోని మైసమ్మగూడ చెరువులో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. గురువారం ఉదయం ఇది గమనించిన స్థానికులు పేట్బషీరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు, హైడ్రా సిబ్బంది మృతదేహాలను వెలికితీశారు. మృతులు బహదూర్పల్లిలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన అశోక్ (50), కూతురు దివ్య(5)గా గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.