News February 17, 2025
HYDలో నేడు డ్రింకింగ్ వాటర్ బంద్

గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్-1లో డయా వాల్వులు అమర్చుతున్నారు. ఈ కారణంగా SRనగర్, సనత్నగర్, జూబ్లీహిల్స్, కూకట్పల్లి, మూసాపేట, చింతల్, సుచిత్ర, అల్వాల్, చరపల్లి, మాదాపూర్, కొండాపూర్, జవహర్నగర్, దమ్మాయిగూడ, కొంపల్లి, గుండ్ల పోచంపల్లి, తూంకుంట, నాగారం, నిజాంపేట, బాచుపల్లి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ తదితర ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిపివేస్తున్నారు. రేపు ఉదయం వరకు సరఫరా ఉండదు.
SHARE IT
Similar News
News December 20, 2025
బొల్లారంలో పూలు గుసగుసలాడేనని.. సైగ చేసేనని

అందమైన పూలు.. అలరించే రంగులు.. మనలను కనువిందు చేయనున్నాయి. కొత్త ఏడాదిలో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం ఇందుకు వేదిక కానుంది. JAN 3 నుంచి 9 రోజుల పాటు (11 వరకు) ఉ. 10 నుంచి రాత్రి 8 వరకు ఉద్యాన్ ఉత్సవ్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చకచకగా సాగుతున్నాయి. ప్రవేశం ఉచితమని.. ప్రకృతి ప్రేమికులు ఈ అవకాశం వినియోగించుకోవాలని రాష్ట్రపతి నిలయం ఆఫీసర్ రజినీ ప్రియ తెలిపారు.
News December 20, 2025
గండిపేట: నిఘా నేత్రాలకు పక్షవాతం!

₹కోట్లు కుమ్మరించి నిర్మించిన గండిపేట ల్యాండ్స్కేప్ పార్కులో భద్రత గాలిలో దీపమైంది! అక్కడి నిఘా నేత్రాల పనిచేయక అక్రమార్కుల ధాటికి చెరువు కాలుష్యపు కోరల్లో చిక్కుకుంది. ఎట్టకేలకు నిద్రలేచిన HMDA, కెమెరాల మరమ్మతులు, ఏడాది నిర్వహణ O&Mకు ₹14,62,079తో టెండర్లు పిలిచింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన, కాలుష్యం ముదిరిన తర్వాత ఇప్పుడు మరమ్మతులకు పూనుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
News December 20, 2025
మహానగరం ఫుల్ పిక్చర్ రేపే విడుదల?

మున్సిపాలిటీల విలీనం తర్వాత పునర్విభజనకు సంబంధించి మహానగర వ్యాప్తంగా 5,905 అభ్యంతరాలతో పాటు సలహాలు కూడా వచ్చాయి. వీటన్నింటిని పరిశీలించిన గ్రేటర్ అధికారులు తుది నివేదికను రూపొందించారు. ఇందుకు సంబంధించి ఫైనల్ నోటిఫికేషన్ రేపు విడుదల చేసే అవకాశముందని తెలుస్తోంది. హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సర్కారు పెద్దలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.


