News February 17, 2025
HYDలో నేడు డ్రింకింగ్ వాటర్ బంద్

గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్-1లో డయా వాల్వులు అమర్చుతున్నారు. ఈ కారణంగా SRనగర్, సనత్నగర్, జూబ్లీహిల్స్, కూకట్పల్లి, మూసాపేట, చింతల్, సుచిత్ర, అల్వాల్, చర్లపల్లి, మాదాపూర్, కొండాపూర్, జవహర్నగర్, దమ్మాయిగూడ, కొంపల్లి, గుండ్ల పోచంపల్లి, తూంకుంట, నాగారం, నిజాంపేట, బాచుపల్లి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ తదితర ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిపివేస్తున్నారు. రేపు ఉదయం వరకు సరఫరా ఉండదు.
SHARE IT
Similar News
News November 17, 2025
సమస్యలుంటే నేరుగా ఫిర్యాదు చేయండి: సంగారెడ్డి ఎస్పీ

ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రజలు నేరుగా తనకు ఫిర్యాదు చేయవచ్చని సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అందిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత స్టేషన్ ఎస్.ఐ.లను ఎస్పీ ఆదేశించారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు పాల్గొన్నారు.
News November 17, 2025
సమస్యలుంటే నేరుగా ఫిర్యాదు చేయండి: సంగారెడ్డి ఎస్పీ

ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రజలు నేరుగా తనకు ఫిర్యాదు చేయవచ్చని సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అందిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత స్టేషన్ ఎస్.ఐ.లను ఎస్పీ ఆదేశించారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు పాల్గొన్నారు.
News November 17, 2025
డిజిటల్ అరెస్టు అంటూ ₹32 CRకు టోపీ

సైబర్ ఫ్రాడ్కు చిక్కి బెంగళూరుకు చెందిన ఓ మహిళ ఏకంగా ₹32 CR మేర పోగొట్టుకుంది. పాస్పోర్టులు, క్రెడిట్ కార్డులు, డ్రగ్స్తో కొరియర్ వచ్చిందని, ఇది క్రైమ్ అని ఆమెకు ముందు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆపై నేరగాళ్లు డిజిటల్ అరెస్టు అని నెల రోజులు స్కైప్, కాల్స్తో నిఘా పెట్టారు. RBI FIU పేరిట ఆస్తులు ఇతర చిట్టా అడిగారు. వాటి క్లియరెన్స్ పేరిట ₹32 కోట్లు తీసుకున్నారు. మోసంపై ఆమె ఆలస్యంగా ఫిర్యాదు చేశారు.


