News January 25, 2025

HYDలో ఫేక్ ఫాస్ట్ ట్రాక్ వాచ్‌లు అమ్ముతున్న ముఠా అరెస్ట్

image

HYDలో ఫేక్ ఫాస్ట్ ట్రాక్ వాచ్‌లు అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బిహార్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు యువకులు ఫాస్ట్ ట్రాక్ వాచ్‌లు అని చెప్పి ఫేక్ వాచ్‌లను అధిక రేట్లకు విక్రయిస్తున్నారు. చార్మినార్ పరిసరాల్లో ఈ ముఠా అమ్మకాలు జరపగా పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.కోటి విలువ చేసే 6,037 వాచ్‌లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

Similar News

News November 27, 2025

జాతీయస్థాయి పోటీల్లో పెదబయలు EMRS విద్యార్థి సత్తా!

image

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల(EMRS) విద్యార్థులకు నిర్వహించిన జాతీయ స్థాయి వాల్యూ ఎడ్యుకేషన్ ఒలంపియడ్ పోటీల్లో పెదబయలు EMRS విద్యార్థి సత్తా చాటారు. వివిధ రాష్ట్రాల నుంచి 12 మంది విద్యార్థులు విజయం సాధించగా, AP నుంచి తమ పాఠశాలలో 7వ తరగతి విద్యార్థి కొర్ర గౌతమ్ 3వ స్థానంలో నిలిచారని ప్రిన్సిపాల్ అమిత్ ఆనంద్ తెలిపారు. గౌతమ్.. కేంద్ర మంత్రి చేతుల మీదుగా బహుమతి తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.

News November 27, 2025

‘పరకామణి’తో నాకు సంబంధం లేదు: YV సుబ్బారెడ్డి

image

తిరుపతి పరకామణి విషయంలో ఏం జరిగిందో తనకు తెలియదని YV సుబ్బారెడ్డి అన్నారు. ఈ అంశంపై రేపు విజయవాడలో CID విచారణకు హాజరుకానున్నట్లు ఆయన పేర్కొన్నారు. అప్పన్న గతంలో తనకు PA మాత్రమే అని ఆ తర్వాత అతనితో తనకు సబంధం లేదని స్పష్టం చేశారు. TTD వ్యవహారంతో అప్పన్నకు సంబంధం లేదని, అదే విషయం సిట్‌కు చెప్పానన్నారు.

News November 27, 2025

నల్గొండ: రేపటితో ముగుస్తున్న ఎంజీయూ డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు

image

ఎంజీయూ పరిధిలో ఈ నెల 13 నుంచి ప్రారంభమైన డిగ్రీ సెమిస్టర్ 1, 3, 5 పరీక్షలు రేపటితో ముగుస్తాయని డాక్టర్ ఉపేందర్ రెడ్డి తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రశాంత వాతావరణంలో పరీక్షలు పూర్తయ్యాయన్నారు. ఇప్పటికే ఈ సెమిస్టర్లకు సంబంధించిన ప్రాక్టికల్ పరీక్షల తేదీలను విడుదల చేసినట్లు తెలిపారు. డిసెంబర్లో సెమిస్టర్ 2, 4, 6 తరగతులు ప్రారంభిస్తామని రిజిస్టార్ పేర్కొన్నారు.