News March 11, 2025
HYDలో బయటకు వెళ్లాలంటే.. గొడుగు పట్టాల్సిందే!

గ్రేటర్ HYDలో రోజురోజుకూ ఎండల తీవ్రత పెరుగుతోంది. నేటి ఉష్ణోగ్రత 36 డిగ్రీలకు చేరుకుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మార్చి మొదటివారంలోనే ఇంతటి ఉష్ణోగ్రత నమోదవ్వడం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో నగర ప్రజలు మధ్యాహ్నం బయటకు వెళ్లాలంటే ఆందోళన చెందుతున్నారు. బయటకు వెళ్లాలంటే గొడుగు పట్టడం తప్పనిసరి అవుతోంది అని వారు అభిప్రాయపడుతున్నారు.
Similar News
News February 9, 2026
హైదరాబాద్: తిండి కంటే ఫొటోలకే క్రేజ్!

హైదరాబాద్ పోరగాళ్లది మామూలు రచ్చ కాదు. ఇప్పుడు తిండి రుచి కంటే కూడా అది కెమెరాలో ఎట్లా కనిపిస్తుందనేదే ముఖ్యం. నియాన్ లైట్ల కొరియన్ ఫుడ్ దగ్గర మొదలుపెట్టి, మంటలు పుట్టించే ఫైర్ నూడుల్స్ దాకా అన్నీ రీల్స్ కోసమే. ప్లేటులో చీజ్ ఊగినా, పొగలు కక్కినా అదో వైరల్ సెన్సేషన్. కడుపు నిండడం సంగతేమో కానీ వీడియో క్రేజీగా రాకపోతే వీళ్లకు ఆ క్యాలరీలు దండగన్నమాట. డ్రామా ఉంటేనే మన జెన్-జీకి అసలైన దావత్.
News February 9, 2026
HYD: ఖాతాలోకి పైసలు.. కానీ గుండెల్లో రైళ్లు!

కార్పొరేట్ ఆట కట్టించేందుకు సర్కారు ‘DBT’ అస్త్రం విసిరింది. “నీ ఫీజు నీ చేతికే” అంటున్న.. ఏదో తిరకాసు ఉందని టాక్. గ్రేటర్లోని 3.5 లక్షల మంది పేద విద్యార్థులకు నిధులు టైముకు రాకపోతే గతేంటి? గతంలో కాలేజీలు సర్కారు కోసం ఎదురుచూసేవి, ఇప్పుడు విద్యార్థులే మేనేజ్మెంట్ల ముందు నిలబడాల్సిన పరిస్థితి. ఈ పద్ధతి కాలేజీలను దారికి తెస్తుందా?, విద్యార్థులను అప్పుల ఊబిలో ముంచుతుందా! అనేది చర్చనీయాంశమైంది.
News February 9, 2026
GHMC 3 ముక్కలు.. బాస్ ఆయనే!

GHMCని 3 ముక్కలు చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. HYD, CYB, మల్కాజిగిరి వేర్వేరు కార్పొరేషన్లు కొలువుదీరనున్నాయి. ‘స్పెషల్ ఆఫీసర్’గా Special CS జయేశ్ రంజన్ను రంగంలోకి దించుతోంది. సైబరాబాద్ కార్పొరేషన్ పగ్గాలు పి.సృజనకు, మల్కాజిగిరి బాధ్యతలు వినయ్ కృష్ణారెడ్డికి అప్పగించే ఛాన్స్ ఉంది. ఇక ఎన్నికలు ముగిసే వరకు గ్రేటర్ ప్రధాన కమిషనర్గా RV కర్ణన్ చక్రం తిప్పనున్నారు. రేపు GO విడుదల కానుందని సమాచారం.


