News March 5, 2025
HYDలో బీర్లపై పాత ధరలు.. ఇదేంటి?

HYDలో బీర్ సీసాలపై పాత ధరలే దర్శనమిస్తున్నాయని ఓ కస్టమర్ తెలిపారు. నాగోల్లోని వైన్ షాపులో బుధవారం బీఎస్ పాటిల్ అనే వ్యక్తి 2 బీర్లు కొనుగోలు చేసినట్లు తెలిపారు. MRP మాత్రం రూ.210గా ఉంది. ఇటీవల పెంచిన ధరల ప్రకారం రూ.250కి అమ్మినట్లు పేర్కొన్నారు. లేబుల్స్పై పాత ధరలు ఉండటం ఏంటని నిలదీస్తే వైన్స్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని వాపోయారు. మీప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయి? కామెంట్ చేయండి.
Similar News
News December 8, 2025
ఇక తెలంగాణ ‘ఫ్యూచర్’ మన HYD

నేటి నుంచే కందుకూరులో గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. ఇది ప్రపంచ ఆర్థిక సదస్సు ‘దావోస్’గా కార్యరూపం దాల్చింది. ఈ ఫ్యూచర్ సిటీలో భారీ పెట్టుబడులను ఆకర్షించి, యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా సంపన్నులను ఆహ్వానించింది. ఇప్పటికే బ్లాక్ క్యాట్, ఆక్టోపస్, గ్రేహౌండ్స్ అక్కడ పహారా కాస్తున్నాయి. ఈ సమ్మిట్తో ‘నిన్నటి వరకు ఒక లెక్క నేటి నుంచి మరో లెక్క’ అని సీఎం ధీమా వ్యక్తంచేశారు.
News December 8, 2025
HYD: గ్లోబల్ సమ్మిట్కు సర్వం సిద్ధం

ఫ్యూచర్ సిటీలో నేడు, రేపు నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు సర్వం సిద్ధం చేశారు. ఈ సమ్మిట్కు దేశ విదేశాలకు చెందిన పెట్టుబడుదారులు, పారిశ్రామిక వేత్తలు, ఐటీ కంపెనీల సీఈవోలు, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు హాజరు కాబోతున్నారు. 8వ తేది మధ్యాహ్నం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ సమ్మిట్ను ప్రారంభించనున్నారు. 9వ తేదీ సాయంత్రం 6 గంటలకు సమ్మిట్ ముగియనుంది.
News December 8, 2025
HYD: గ్లోబల్ సమ్మిట్కు సర్వం సిద్ధం

ఫ్యూచర్ సిటీలో నేడు, రేపు నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు సర్వం సిద్ధం చేశారు. ఈ సమ్మిట్కు దేశ విదేశాలకు చెందిన పెట్టుబడుదారులు, పారిశ్రామిక వేత్తలు, ఐటీ కంపెనీల సీఈవోలు, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు హాజరు కాబోతున్నారు. 8వ తేది మధ్యాహ్నం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ సమ్మిట్ను ప్రారంభించనున్నారు. 9వ తేదీ సాయంత్రం 6 గంటలకు సమ్మిట్ ముగియనుంది.


