News January 7, 2025
HYDలో భారీగా పెరిగిన ఓటర్లు

రాష్ట్రవ్యాప్తంగా తుది ఓటరు జాబితా విడుదలైంది. రంగారెడ్డి, HYD, మేడ్చల్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కలిపి 1.12 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లి నియోజకవర్గం అత్యధికంగా 7.65 లక్షల మంది ఓటర్లతో మొదటి స్థానంలో ఉండగా.. 2.32 లక్షలమంది ఓటర్లతో చివరి స్థానంలో చార్మినార్ ఉంది. కేవలం ఒక్క ఏడాదిలోనే 2 లక్షల మంది ఓటర్లు పెరిగినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News November 27, 2025
RR: సర్పంచ్, వార్డు స్థానాలకు.. 264 నామినేషన్లు

రంగారెడ్డి పల్లెల్లో పంచాయతీ ఎన్నికల హడావుడి జోరందుకుంది. జిల్లాలో మొదటి విడతలో షాద్నగర్ నియోజకవర్గం, శంషాబాద్లో గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతలో మొదటి రోజు 174 సర్పంచ్ స్థానాలకు 145 మంది, 1,530 వార్డు స్థానాలకు 119 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. మొదటి విడత నామినేషన్లు దాఖలు చేసేందుకు నవంబర్ 29న సా.5 వరకు అవకాశం ఉంది. ఉపసంహరణకు DEC 3 వరకు అవకాశం ఉంటుంది.
News November 27, 2025
RR: సర్పంచ్, వార్డు స్థానాలకు.. 264 నామినేషన్లు

రంగారెడ్డి పల్లెల్లో పంచాయతీ ఎన్నికల హడావుడి జోరందుకుంది. జిల్లాలో మొదటి విడతలో షాద్నగర్ నియోజకవర్గం, శంషాబాద్లో గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతలో మొదటి రోజు 174 సర్పంచ్ స్థానాలకు 145 మంది, 1,530 వార్డు స్థానాలకు 119 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. మొదటి విడత నామినేషన్లు దాఖలు చేసేందుకు నవంబర్ 29న సా.5 వరకు అవకాశం ఉంది. ఉపసంహరణకు DEC 3 వరకు అవకాశం ఉంటుంది.
News November 27, 2025
RR: ధ్రువపత్రాల కోసం మీ సేవకు పరుగులు

గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కుల, ఆదాయ ధ్రువ పత్రాల కోసం మీసేవ సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. పోటీ చేసే అభ్యర్థులకు ధ్రువపత్రాలు తప్పనిసరి కావడంతో వారితో మీసేవ సెంటర్లు కిక్కిరిసి పోయాయి. రెండో విడతలో నిర్వహించే ఎన్నికల కోసం ముందస్తుగా పత్రాలు సమకూర్చుకుంటున్నట్లు వారు తెలిపారు. ఎన్నికల పుణ్యమా అంటూ తమకు అదనపు గిరాకీ వస్తుందని ఆమనగల్ సహా పలు సెంటర్లలోని నిర్వాహకులు చెబుతున్నారు.


