News January 7, 2025
HYDలో భారీగా పెరిగిన ఓటర్లు

రాష్ట్రవ్యాప్తంగా తుది ఓటరు జాబితాను విడుదలైంది. రంగారెడ్డి, HYD, మేడ్చల్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కలిపి 1.12 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లి నియోజకవర్గం అత్యధికంగా 7.65 లక్షల మంది ఓటర్లతో మొదటి స్థానంలో ఉండగా.. 2.32 లక్షలమంది ఓటర్లతో చివరి స్థానంలో చార్మినార్ ఉంది. కేవలం ఒక్క ఏడాదిలోనే 2 లక్షల మంది ఓటర్లు పెరిగినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News November 23, 2025
DANGER: HYDలో వాటర్ హీటర్ వాడుతున్నారా?

వాటర్ హీటర్ ప్రమాదాలు నగరంలో కలవరపెడుతున్నాయి. పోలీసుల వివారలిలా.. మియాపూర్ దావులూరి హోమ్స్లో హౌస్కీపింగ్ ఉద్యోగిని శివలీల (32) శనివారం వాటర్ హీటర్ షాక్ తగిలి తీవ్రంగా గాయపడి మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాత హీటర్లతో ప్రమాదాలు జరుగుతున్నాయని, నాణ్యమైనవి కొనాలని, చేతులు తుడుచుకుని, చెప్పులు ధరించి స్విచ్ఆఫ్ చేశాకే ప్లగ్ పట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
News November 23, 2025
HYD: నగరవాసులకు జలమండలి విజ్ఞప్తి

గుర్తు తెలియని మొబైల్ నంబర్ల నుంచి వచ్చే మెసేజ్లకు స్పందించవద్దని జలమండలి అధికారులు సూచించారు. నల్లా బిల్లు చెల్లించకుంటే కనెక్షన్ తొలగిస్తామని కొందరు వినియోగదారులను SMS ద్వారా బెదిరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి మెసేజ్లకు స్పందించకూడదని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి సందేశాల్లో వచ్చే APK డౌన్లోడ్ చేయొద్దన్నారు. ఏవైనా సందేహాలు ఉంటే కస్టమర్ కేర్ నం. 155313ని సంప్రదించాలని కోరారు.
News November 23, 2025
HYD: నగరవాసులకు జలమండలి విజ్ఞప్తి

గుర్తు తెలియని మొబైల్ నంబర్ల నుంచి వచ్చే మెసేజ్లకు స్పందించవద్దని జలమండలి అధికారులు సూచించారు. నల్లా బిల్లు చెల్లించకుంటే కనెక్షన్ తొలగిస్తామని కొందరు వినియోగదారులను SMS ద్వారా బెదిరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి మెసేజ్లకు స్పందించకూడదని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి సందేశాల్లో వచ్చే APK డౌన్లోడ్ చేయొద్దన్నారు. ఏవైనా సందేహాలు ఉంటే కస్టమర్ కేర్ నం. 155313ని సంప్రదించాలని కోరారు.


