News January 7, 2025
HYDలో భారీగా పెరిగిన ఓటర్లు

రాష్ట్రవ్యాప్తంగా తుది ఓటరు జాబితాను విడుదలైంది. రంగారెడ్డి, HYD, మేడ్చల్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కలిపి 1.12 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లి నియోజకవర్గం అత్యధికంగా 7.65 లక్షల మంది ఓటర్లతో మొదటి స్థానంలో ఉండగా.. 2.32 లక్షలమంది ఓటర్లతో చివరి స్థానంలో చార్మినార్ ఉంది. కేవలం ఒక్క ఏడాదిలోనే 2 లక్షల మంది ఓటర్లు పెరిగినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News November 21, 2025
HYD: జలమండలి పేరిట సైబర్ నేరగాళ్ల కొత్త మోసం

జలమండలి అధికారుల పేరుతో సైబర్ మోసగాళ్లు రిటైర్డ్ ఉద్యోగి ప్రభాకర్ను నమ్మించి ఫోన్లో APK ఫైల్ ఇన్స్టాల్ చేయించి బ్యాంకు ఖాతా నుంచి రూ.2.30 లక్షలు దోచుకున్నారు. కేన్ నంబర్ మార్చాలి, లేదంటే నీటి సరఫరా నిలిపేస్తామని బెదిరించారు. డబ్బు ఇతర ఖాతాలకు వెళ్లినట్లు చిలకలగూడ పోలీసులు గుర్తించి కేసు నమోదు చేశారు. నల్లా బిల్లు పేరిట కొత్త రకమైన మోసాలు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
News November 21, 2025
HYD: జలమండలి పేరిట సైబర్ నేరగాళ్ల కొత్త మోసం

జలమండలి అధికారుల పేరుతో సైబర్ మోసగాళ్లు రిటైర్డ్ ఉద్యోగి ప్రభాకర్ను నమ్మించి ఫోన్లో APK ఫైల్ ఇన్స్టాల్ చేయించి బ్యాంకు ఖాతా నుంచి రూ.2.30 లక్షలు దోచుకున్నారు. కేన్ నంబర్ మార్చాలి, లేదంటే నీటి సరఫరా నిలిపేస్తామని బెదిరించారు. డబ్బు ఇతర ఖాతాలకు వెళ్లినట్లు చిలకలగూడ పోలీసులు గుర్తించి కేసు నమోదు చేశారు. నల్లా బిల్లు పేరిట కొత్త రకమైన మోసాలు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
News November 21, 2025
HYD: నిఖత్ జరీన్కు మంత్రి శుభాకాంక్షలు

గ్రేటర్ నోయిడాలో జరిగిన వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నిఖత్ జరీన్ గోల్డ్ మెడల్ సాధించడంపై HYD ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. బాక్సర్ నిఖత్ జరీన్ మరోసారి తెలుగు జాతి గౌరవాన్ని ఖండాంతరాలు దాటించిందని మంత్రి అభినందించారు. నిఖత్ జరీన్ భవిష్యత్లో మరెన్నో అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించి దేశ, రాష్ట్రాల ప్రతిష్ఠను మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.


