News January 7, 2025

HYDలో భారీగా పెరిగిన ఓటర్లు

image

రాష్ట్రవ్యాప్తంగా తుది ఓటరు జాబితాను విడుదలైంది. రంగారెడ్డి, HYD, మేడ్చల్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కలిపి 1.12 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లి నియోజకవర్గం అత్యధికంగా 7.65 లక్షల మంది ఓటర్లతో మొదటి స్థానంలో ఉండగా.. 2.32 లక్షలమంది ఓటర్లతో చివరి స్థానంలో చార్మినార్ ఉంది. కేవలం ఒక్క ఏడాదిలోనే 2 లక్షల మంది ఓటర్లు పెరిగినట్లు అధికారులు తెలిపారు.

Similar News

News November 14, 2025

జూబ్లీహిల్స్‌లో బీసీ నినాదం పనిచేసిందా..?

image

జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్ విజయానికి బీసీ నినాదం కూడా ప్రధానంగా పనిచేసిందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. BRS అభ్యర్థి మాగంటి సునీత కమ్మ వర్గానికి చెందిన మహిళ కావడం, BJP అభ్యర్థి లంకల దీపక్.. రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తి కావడం నవీన్ యాదవ్‌కు కలిసొచ్చింది. నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న మైనార్టీ ఓట్లతో పాటు మిగితా బీసీ ఓటర్లు నవీన్‌కే జై కొట్టారు. దీంతో భారీ మెజార్టీతో గెలిచారని వారు అంటున్నారు.

News November 14, 2025

జూబ్లీహిల్స్‌లో BJP డిపాజిట్ గల్లంతు.. కారణమిదే?

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో BJPకి 8.76% ఓటింగ్ నమోదైంది. డిపాజిట్ గల్లంతు అవ్వడం మీద రాజకీయ నిపుణుల విశ్లేషణలు ఈ విధంగా ఉన్నాయి.
1.సెగ్మెంట్‌లో మైనార్టీల ఆధిపత్యం
2. 7 డివిజన్లకు ఒక్క BJP కార్పొరేటర్ లేకపోవడం
3.INC vs BRS మధ్యనే పోటీ అన్న సంకేతాలు
4.కనిపించని స్టార్ క్యాంపెయినర్లు
5.ప్రజలను ప్రభావితం చేయని ప్రచారం
5.ముందు నుంచే BJPని పక్కనబెట్టిన సర్వేలు
6.పోల్ మేనేజ్‌మెంట్‌లో విఫలం

News November 14, 2025

HYD: ఇక సిటీలోనూ కాంగ్రెస్ హవా..!

image

గతంలో అర్బన్, రూరల్‌ ప్రాంతాల్లో చక్రం తిప్పిన కాంగ్రెస్ ఆ తర్వాత క్రమంగా గ్రామీణ ప్రాంతాలకే పరిమితమైంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ పల్లె ప్రజలే కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. అయితే హస్తం పార్టీకి సిటీలో బలం లేదనే చర్చ ఏళ్లుగా కొనసాగింది. ఇటీవల కంటోన్మెంట్, తాజాగా జూబ్లీహిల్స్ బైపోల్ విజయంతో సిటీలో కాంగ్రెస్‌కు పునర్ వైభవం వచ్చిందని, GHMC ఎన్నికల్లోనూ తామే గెలుస్తామని ఆ పార్టీ నేతలు అంటున్నారు.