News December 3, 2024
HYDలో మరో ఫ్లై ఓవర్ ఓపెన్

ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ విభాగం పరిధిలో రూ.5827 కోట్లతో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను వర్చువల్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆరంఘర్ నుంచి జూపార్క్ వరకు 4.04 కిలో మీటర్ల పొడవు, 6 లైన్లతో నూతన ఫ్లై ఓవర్ను ప్రారంభించారు. దీనివలన పాతబస్తీ వాసుల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.
Similar News
News October 14, 2025
HYD: BRS సభలో కన్నీరు పెట్టుకున్న మాగంటి సునీత

HYD జూబ్లీహిల్స్ రహమత్నగర్లో బీఆర్ఎస్ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. సభలో ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత కన్నీటి పర్యంతమయ్యారు. తన భర్త, దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ను గుర్తుతెచ్చుకొని కన్నీరు పెట్టుకున్నారు. పక్కనే ఉన్న కుటుంబ సభ్యులు ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితరులు ఆమెకు ధైర్యం చెప్పారు. హరీశ్రావు సైతం ఉద్వేగానికి లోనయ్యారు.
News October 14, 2025
HYD: ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్లో మోసపోయిన తండ్రి, కూతుళ్లు..!

HYD LB నగర్కు చెందిన RTC ఉద్యోగి M.రామకృష్ణ(49), కూతురు మిథాలీ(23) ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్లో మోసపోయారు. AUG 26న వారి స్నేహితుడు పంపిన LF వర్క్ అనే అప్లికేషన్లో రామకృష్ణ పెట్టుబడి పెట్టాడు. ప్రారంభంలో కొంత రాబడి చూపించగా మొత్తం రూ.1,35,210 ఇన్వెస్ట్ చేశాడు. కూతురు ఇన్వెస్ట్ చేసిన రూ.86,220 తిరిగి డ్రా చేసుకోలేకపోయారు. మోసపోయామని తెలుసుకుని ఫిర్యాదు చేశారని సీఐ వినోద్ కుమార్ తెలిపారు.
News October 14, 2025
HYD: సరిపడా ఆర్టీసీ బస్సులు లేక విద్యార్థుల అవస్థలు

సమయానికి గమ్యం చేరుకోవాలని ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదకరంగా యువకులు ప్రయాణం చేస్తున్నా దృశ్యాలు హయత్నగర్లో కనిపించాయి. అబ్దుల్లాపూర్మెట్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులో కాలేజీ విద్యార్థులు ఫుట్ బోర్డుపై వేలాడుతూ ప్రమాదకరంగా ప్రయాణం చేస్తున్నారు. HYD, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో నిత్యం ఇదే పరిస్థితి ఉందని, సంబంధిత అధికారులు స్పందించి బస్సుల సంఖ్య పెంచాలని విద్యార్థులు కోరుతున్నారు.