News January 27, 2025

HYDలో మరో రైల్వే టెర్మినల్..?

image

HYDలో మరో రైల్వే టెర్మినల్ ఏర్పాటయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. SCR అధికారులు మల్కాజిగిరి రైల్వే స్టేషన్ కెపాసిటీ‌పై సర్వే చేపట్టారు. మల్కాజ్గిరి స్టేషన్ టర్మినల్ చేస్తే, నిజామాబాద్, నాందేడ్ సహా అన్ని ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు మేలు జరుగుతుందన్నారు. అప్పటి DRM వందన సైతం మల్కాజ్గిరిలో రైల్వే టెర్మినల్ కోసం ప్లాన్ చేసినప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. ప్రస్తుత చర్యలతో మళ్లీ ఈఅంశం తెరమీదకి వచ్చింది.

Similar News

News September 16, 2025

మహానగరంలో ఇవీ మా సమస్యలు

image

గ్రేటర్ వ్యాప్తంగా నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో తమ సమస్యలు పరిష్కరించాలని 219 మంది వినతిపత్రాలు అందజేశారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 68 వివిధ సమస్యలపై ఫిర్యాదుచేశారు. అలాగే గ్రేటర్ పరిధిలోఉన్న ఆరు జోన్లలో 151 ఫిర్యాదులు వచ్చాయి. కూకట్‌పల్లిజోన్‌లో 55, సికింద్రాబాద్ 33, శేరిలింగంపల్లి 30, ఎల్బీనగర్ 15, చార్మినార్ 11, ఖైరతాబాద్ 7 ఫిర్యాదులు వచ్చాయని GHMC అధికారులు తెలిపారు.

News September 16, 2025

HYD: బదులేనిదీ ప్రశ్న.. పిల్లలకెందుకీ శిక్ష?

image

ఓల్డ్ బోయిన్‌పల్లిలోని మేధా స్కూల్‌లో డ్రగ్స్ తయారీ చేస్తుండటంతో పాఠశాలను అధికారులు సీజ్ చేశారు. దీంతో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. యజమాని చేసిన తప్పుకు అతడిని శిక్షించి పాఠశాల నిర్వహణను వేరేవారికి ఇవ్వవచ్చు కదా అనేది తల్లిదండ్రుల ప్రశ్న. జరిగింది ముమ్మాటికీ తప్పే.. దీనికి విద్యార్థులను ఎందుకు శిక్షించడం అనేది తల్లిదండ్రుల వర్షన్. అధికారులేమో ప్రత్యామ్నాయం చూపిస్తాం అంటున్నారు.

News September 16, 2025

మియాపూర్: డ్యూటీలో గుండెపోటుతో కండక్టర్ మృతి

image

మియాపూర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మియాపూర్ డిపోలో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ కండక్టర్ పండరి గుండెపోటుకు గురై మృతిచెందాడు. స్థానికుల వివరాలిలా.. సహోద్యోగులతో సరదాగా మాట్లాడుతూ పండరి వాష్‌రూమ్‌కి వెళ్లొస్తానని వెళ్లాడు. వెంటనే అకస్మాత్తుగా కుప్పకూలిపోవడంతో సహోద్యోగులు అప్రమత్తమయ్యారు. వెంటనే వైద్య సిబ్బందిని సంప్రదించినప్పటికీ ప్రాణాలు దక్కలేదని తోటి ఉద్యోగులు కన్నీటి పర్యంతం అయ్యారు.