News February 18, 2025
HYDలో రూ.150 కోట్లతో సుందరీకరణ పనులు

HYD ఇమేజ్ను పెంచేందుకు ప్రభుత్వం రూ.150 కోట్లతో 106 ప్రాంతాల్లో సుందరీకరణ పనులు చేపట్టింది. షేక్పేట్, జూబ్లీహిల్స్లో అభివృద్ధి పనులకు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి శంకుస్థాపన చేశారు. ఇప్పటివరకు 78 ప్రాజెక్టులు పూర్తి కాగా, మిగిలినవి ప్రగతిలో ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టితో పనులు వేగంగా సాగుతున్నాయి.
Similar News
News March 6, 2026
HYD: ఫైల్ కదలాలంటే సమర్పించుకోవాల్సిందే..!

సికింద్రాబాద్ GHMC ఆఫీసులో అకౌంట్స్ ఎగ్జామినర్ సంతోష్ ఓ పెన్షనర్ దగ్గర రూ.35వేలు లంచం తీసుకుంటూ ACBకి రెడ్హ్యాండెడ్గా దొరికిన విషయం తెలిసిందే. కాగా ఇది చిన్న శాంపిల్ మాత్రమే. ఇంజినీరింగ్ విభాగంలో 30శాతం కమీషన్ల దందా నడుస్తోందనే ఆరోపణలున్నా కేవలం చిన్న క్లర్కులను పట్టుకొని హడావిడి చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. వందల కోట్ల ఆస్తులు వెనకేసిన పెద్ద ఆఫీసర్ల ఫైళ్లు మాత్రం బీరువాల్లోనే మగ్గుతున్నాయి.
News March 6, 2026
HYD: ఇలాంటి మెసేజ్లు వస్తున్నాయా.. జాగ్రత్త..!

HYDవాసులను జలమండలి బిల్లుల కంటే కేటుగాళ్ల మెసేజ్లే ఎక్కువ భయపెడుతున్నాయి. బిల్లు కట్టకపోతే కనెక్షన్ కట్ చేస్తామంటూ HMWSSBపై ఫేక్ లింకులు పంపిస్తున్నారు. తెలీక ఆ లింక్ నొక్కితే అకౌంట్లు ఖాళీ అవుతున్నాయి. ఇప్పటికే సిటీలో రూ.కోట్లు కాజేసినట్లు సమాచారం. డిపార్ట్మెంట్ ఆఫీసర్లు మాత్రం మేము అలాంటి మెసేజ్లే పంపమని చేతులు దులుపుకుంటున్నారు. కాగా, కస్టమర్ల వివరాలు బయటకెలా వెళ్తున్నాయో మాత్రం తెల్వట్లేదు.
News March 6, 2026
HYD: మార్కెటింగ్పై మహిళలకు ఉచిత శిక్షణ

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని నిరుద్యోగ మహిళలు, యువతులకు మార్కెటింగ్పై ఉచిత శిక్షణ ఇస్తామని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం జిల్లా మేనేజర్ శైలకుమారి తెలిపారు. చిలుకూరులోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో ఈనెల 17 నుంచి 3 నెలల పాటు రిటైల్ సేల్స్ అసిస్టెంట్ కోర్సుల్లో శిక్షణ ఇస్తామని, పదో తరగతి పాసై, 18 ఏండ్లు నిండిన వారు ఈనెల 16లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 7660022524ను సంప్రదించాలన్నారు.


