News February 1, 2025
HYDలో రూ. 50కే డోర్ డెలివరీ!

HYDలో ఎక్కడికైనా కేవలం రూ.50కే కిలో వరకు బరువు కలిగిన సామగ్రిని డోర్ డెలివరీ చేస్తున్నట్లు ఆర్టీసీ కార్గో అధికారులు తెలిపారు. నగరవ్యాప్తంగా ఈ సేవలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. వస్తువు బరువు ప్రకారం ఛార్జీలు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉప్పల్, రామంతాపూర్, హబ్సిగూడ, ఎల్బీనగర్ లాంటి ప్రాంతాల్లో ప్రత్యేకంగా కార్గో కౌంటర్లు ఏర్పాటు చేశారు.SHARE IT
Similar News
News October 14, 2025
వైకుంఠ గంగే స్వామివారి పుష్కరిణి

తిరుమల కొండతో పాటు, స్వామి పుష్కరిణిని కూడా గరుత్మంతుడు వైకుంఠం నుంచి భూమిపైకి తెచ్చాడు. ఇది శ్రీదేవి, భూదేవిలకు ప్రియమైనది. దీన్ని సర్వతీర్థాలకు జన్మస్థానంగానూ భావిస్తారు. విరజా నదిలా సకల పాపాలను పోగొట్టే శక్తి దీనికి ఉంటుంది. ఈ పుష్కరిణిలో స్నానం చేస్తే ఐహిక ఫలాలన్నీ లభిస్తాయి. ఈ పుష్కరిణిని దర్శించడం, స్మరించడం, సేవించడం వలన సమస్త శుభాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News October 14, 2025
నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్లో ఉద్యోగాలు

నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ 4 చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 31 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBA, PGDBM, PGDM, BSC, MSC(అగ్రికల్చర్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. చీఫ్ మేనేజర్కు నెలకు ₹90వేల నుంచి ₹2.40లక్షలు, సీనియర్ మేనేజర్కు ₹80వేల నుంచి ₹2.20లక్షలు జీతం అందుతుంది. వెబ్సైట్: https://www.nationalfertilizers.com/
News October 14, 2025
చోడవరంలో 275 కిలోల గంజాయి పట్టివేత

చోడవరం వద్ద పోలీసులు 275 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా సోమవారం తెలిపిన వివరాల ప్రకారం, అల్లూరి జిల్లా తర్లగూడకు చెందిన వంతల దేవదాస్ ఒడిశా చిత్రకొండ నుంచి గంజాయి కొనుగోలు చేసి రాజస్థాన్కు తరలించేందుకు యత్నించాడు. ఎనిమిది సంచుల్లో ప్యాక్ చేసిన గంజాయి, కారు, రెండు బైక్లు, ఐదు ఫోన్లు స్వాధీనం. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు.