News April 6, 2025
HYDలో రేపు మొత్తం వైన్స్ బంద్..!

శ్రీరామనవమిని పురస్కరించుకుని HYD నగరంలోని ట్రై కమిషనరేట్లు HYD, సైబరాబాద్, రాచకొండ పరిధిలో రేపు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వైన్స్ బంద్ ఉంటాయని అధికారులు తెలిపారు. రాచకొండ పోలీసులు నిన్ననే చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా HYD, సైబరాబాద్ పోలీసులు సైతం వెల్లడించారు. కల్లు దుకాణాలు, రెస్టారెంట్ల అనుబంధ బార్లు, మిలిటరీ క్యాంటీన్లు, స్టార్ హోటల్లు, రిజిస్టర్ క్లబ్లలోనూ బంద్ ఉంటాయన్నారు
Similar News
News November 25, 2025
ఖమ్మం బస్టాండ్ వద్ద డ్రైనేజీలో మృతదేహం

ఖమ్మం నూతన బస్ స్టేషన్ సమీపంలోని కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న డ్రైనేజీలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. వయస్సు సుమారు 30 సంవత్సరాలు ఉంటుందని, కుడి చేతికి సూర్యుడి టాటూ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి సమాచారంతో అక్కడకు చేరుకున్న సామాజిక సేవకుడు అన్నం శ్రీనివాస్ మృతదేహాన్ని డ్రైనేజీ నుంచి వెలికితీసి మార్చురీకి తరలించారు. మృతుడి ఆచూకీ తెలిస్తే తమను సంప్రదించాలని టూ టౌన్ పోలీసులు కోరారు.
News November 25, 2025
SKLM: మృత్యువుగా మారిన 3 చక్రాల బండి

మందస మండలం వీజీపురం గ్రామానికి చెందిన దివ్యాంగుడు సింహాచలం (43) మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. సింహాచలం 3 చక్రాల స్కూటీపై జాతీయరహదారిపై ప్రయాణిస్తున్నాడు. ప్రమాదవశాత్తు అది బోల్తా పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని 108లో హరిపురం సీహెచ్కు తరలించారు. పరిస్థితి విషమించి మృతి చెందాడు. మందస పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News November 25, 2025
నంద్యాల: కేసీ కెనాల్లో బాలుడి మృతదేహం

గోస్పాడు మండలం సాంబవరం గ్రామం వద్ద కేసీ కెనాల్లో పొన్నాపురానికి చెందిన ఖాజావలి అనే బాలుడి మృతదేహం లభ్యమయింది. ఖాజావలి సోమవారం మధ్యాహ్నం కేసీ కెనాల్ వద్ద ఆడుకుంటుండగా జారి కెనాల్లో పడ్డాడు. కుటుంబ సభ్యులు, స్నేహితులు గాలించినా ఫలితం లేకుండా పోయింది. ఇవాళ సాంబవరం గ్రామం వద్ద ఖాజావలి మృతదేహం లభ్యమయింది. ఘటనపై గోస్పాడు పోలీసులు కేసు నమోదు చేశారు.


