News December 30, 2024
HYDలో రేపు రాత్రి 10 గం.కి ఫ్లైఓవర్లు బంద్
న్యూఇయర్ వేడుకలకు భద్రతలో భాగంగా పోలీసులు నగరంలోని ఫ్లైఓవర్లను బంద్ చేస్తున్నారు. బైక్ రేసులు, అతివేగంతో దూసుకెళ్లే ప్రమాదం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 31న రాత్రి 10 గంటల తర్వాత బైక్లు, వాణిజ్య వాహనాలకు ఫ్లైఓవర్ల మీదకు అనుమతి ఉండదు. ఎయిర్పోర్ట్కు వెళ్లే ప్రయాణికులకు మాత్రం తగిన ఆధారాలు చూపిస్తే పీవీఎన్ఆర్ ఫ్లైఓవర్ మీదకి అనుమతిస్తారు.
Similar News
News January 23, 2025
HYD ఎయిర్పోర్ట్లో సందర్శకులకు నో ఎంట్రీ
గణతంత్ర వేడుకలు సమీపిస్తున్న వేళ అధికారులు అప్రమత్తమయ్యారు. శంషాబాద్ విమానాశ్రయంలో సందర్శకులకు నో ఎంట్రీ అని బోర్డ్ పెట్టారు. ఈ నెల 30 వరకు అనుమతి ఇవ్వమన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా అంతర్జాతీయ విమానాశ్రయాలకు రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో RGIAలోనూ భద్రత కట్టుదిట్టం చేశారు. ప్యాసింజర్ వెంట ఒకరు, ఇద్దరు మాత్రమే రావాలని సూచించారు. SHARE IT
News January 23, 2025
సికింద్రాబాద్ రైల్వేలో ఉద్యోగాలు
SCRలో ఉద్యోగం చేయాలనుకునేవారికి శుభవార్త. RRB గ్రూప్ D నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 32,438 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఇందులో SCR పరిధిలో 1642 ఖాళీలు ఉన్నాయి. స్పెషల్ క్యాటగిరీలో మరో 710 ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. వేతనం రూ. 18000 ఉంటుంది. వయస్సు: 18-36 మధ్య ఉండాలి. నేటి నుంచి ఫిబ్రవరి 22 వరకు అప్లై చేసుకోవచ్చు. అర్హత: 10th, ITI ఉత్తీర్ణత.
SHARE IT
News January 23, 2025
HYD: సెక్రటేరియేట్కు వెళ్లే టూరిస్టులపై ఆంక్షలు
సచివాలయంకు వచ్చే సందర్శకులపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇకపై సచివాలయం లోపలకి వెళ్లేవారికి ఇచ్చే పాసుతో ఒక్కరిని మాత్రమే అనుమతినిస్తామని తెలిపింది. సీఎస్ ఫ్లోర్లో సందర్శకుల తాకిడి ఎక్కువ కావడంతోపాటు.. సందర్శకుల సంఖ్యను తగ్గించాలని SPF సిబ్బంది కోరడంతో భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.