News June 7, 2024
HYDలో వర్షాల వేళ పాటించాల్సిన జాగ్రత్తలు

HYD, రంగారెడ్డి జిల్లాల్లో గత రెండ్రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ‘వర్షం కురుస్తున్న సమయంలో కరెంట్ స్తంభాలను తాకొద్దు. మ్యాన్హోల్స్ ఓపెన్ చేయొద్దు. వరద ఉధృతిలో రోడ్డు దాటే సాహసం చేయొద్దు. శిథిలావస్థ భవనాలు ఖాళీ చేయాలి.’ అని సూచించారు. ఈ ఏడాది HYDలో వేరు వేరు ఘటన(వర్షం, వరదలు)ల్లో 15 మంది చనిపోయారు. బీ కేర్ ఫుల్. SHARE IT
Similar News
News November 5, 2025
HYD: రేవంత్ రెడ్డికి KTR కౌంటర్

జూబ్లీహిల్స్ బైఎలక్షన్ రోడ్ షోలో సీఎం వ్యాఖ్యలకు KTR స్పందించారు. ‘భారత రాజ్యాంగం ఆర్టికల్స్ 25-28 ద్వారా మత స్వేచ్ఛను ప్రాథమిక హక్కుగా ఇచ్చింది. దీనికి అంబేడ్కర్ కృషి చేశారు. ప్రతి పౌరుడు తన మతాన్ని స్వేచ్ఛగా పాటించడానికి, ప్రచారం చేయడానికి ఈ హక్కు అనుమతిస్తుంది. రాజకీయ చర్చలతో లౌకిక రాజ్యమైన భారత్ గొప్పతనాన్ని అపహాస్యం చేయొద్దు’ అని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
News November 5, 2025
KTRతో చర్చకు సిద్ధం: జూపల్లి కృష్ణారావు

కేటీఆర్పై మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ పాలనలో ఒక్కో వ్యక్తిపై రూ.4 లక్షల అప్పు మోపారని, పదేళ్లు బుల్డోజర్ పాలన నడిపిందీ బీఆర్ఎస్సేనని మండిపడ్డారు. అధికారులను బెదిరిస్తున్నానన్న ఆరోపణలు నిరాధారమని, తన బాధ్యతలు మాత్రమే నిర్వర్తిస్తున్నానని చెప్పారు. అవసరమైతే దీనిపై KTRతో చర్చకు సిద్ధమని జూపల్లి సవాల్ విసిరారు. ఫేక్ సర్వేలతో ప్రజలను తప్పుదోవ పట్టించారని విమర్శించారు.
News November 5, 2025
FLASH: బీజాపూర్- HYD హైవేపై మరో యాక్సిడెంట్

మీర్జాగూడ ఘటన మరవకముందే తాజాగా బీజాపూర్-HYD జాతీయ రహదారిలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. మొయినాబాద్ మండలం తాజ్ సర్కిల్ వద్ద బుధవారం హైదరాబాద్ నుంచి చేవెళ్ల వైపు వెళ్తున్న కారు రోడ్డు ఇరుకుగా ఉండడంతో వేగంగా మర్రిచెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో నలుగురు యువకులకు గాయాలవగా మరొక యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.


