News March 20, 2025

HYDలో విశ్వ సుందరి సందడి!

image

మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా నగరంలో నేడు సందడి చేయనున్నారు. మధ్యాహ్నం 12:00 గంటలకు బేగంపేటలోని హోటల్ టూరిజం ప్లాజాలో మిస్ వరల్డ్ –2025 ప్రీ-లాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమె హాజరుకానున్నారు. ఈ మేరకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. మే 7 నుంచి ప్రారంభమయ్యే అందాల పోటీ నిర్వహణ ఏర్పాట్లపై చర్చించనున్నారు. మంగళవారం ఆమె చీరకట్టులో యాదాద్రి స్వామిని దర్శించుకొన్న ఫొటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.

Similar News

News March 28, 2025

HYD: భవనం పైనుంచి దూకి వివాహిత సూసైడ్

image

భవనం పైనుంచి దూకి వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ముషీరాబాద్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు..భోలక్‌పూర్‌కు చెందిన శబరీష్‌తో సౌజన్యకు గత నవంబర్ 13న వివాహమైంది. నిత్యం భర్త, అత్తమామలు గొడవ పడుతూ ఇంట్లోంచి వెళ్లిపోవాలని ఇబ్బందులకు గురిచేస్తున్నారని కుటుంబీకులకు ఫోన్ చేసిన సౌజన్య.. గురువారం మధ్యాహ్నం భవనంపై నుంచి దూకింది. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ చనిపోయింది.

News March 28, 2025

HYDలో 50 మంది GOVT అధికారుల తొలగింపు..!

image

పదవీ విరమణ పొందినా చాలా మంది ఇంకా ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ బేసిక్, రీ అపాయింట్‌మెంట్ పేరిట ఇంకా ఉద్యోగంలో కొనసాగుతున్నారు. ఇలాంటివారు జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 50 మంది ఉన్నట్లు తేలింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరికి ఉద్వాసన పలకాలని నిర్ణయించింది. దీంతో 50 మంది వరకు మార్చి 31న ఇంటిముఖం పట్టనున్నారు. అడిషనల్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, ఇంకా కిందిస్థాయి సిబ్బంది వీరిలో ఉన్నారు.

News March 28, 2025

HYDలో తగ్గిన ఇళ్ల కొనుగోళ్లు: KTR

image

హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో HYDలో ఇళ్ల కొనుగోళ్లు తగ్గాయని KTR Xలో ఆరోపించారు. పేదల ఇళ్లమీదకు బుల్డోజర్‌లు పంపి పెద్దలతో సెటిల్‌మెంట్లు చేసుకుంటున్నారని పేర్కొన్నారు.‘గత త్రైమాసికంలో 49% ఇళ్ల విక్రయాలు తగ్గాయి. ఆఫీస్‌ల లీజింగ్ కూడా పాతాళానికి పడిపోయింది. ఈ ఏడాది 3 నెలల్లో కొనుగోళ్లు 41% తగ్గాయి. ప్రభుత్వం అబద్ధాలు మాని అభివృద్ధి చేయాలి, కూల్చడం కాదు, కట్టడం నేర్చుకోవాలి’ అని రాసుకొచ్చారు.

error: Content is protected !!