News March 4, 2025

HYDలో శిరీషను చంపి డ్రామా!

image

మలక్‌పేట జమున టవర్స్‌లో శిరీష మృతి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెది సహజ మరణం కాదని పోస్టుమార్టం నివేదికలో తేలింది. పోలీసుల వివరాలు.. 2016లో వినయ్‌ను శిరీష ప్రేమ వివాహం చేసుకుంది. మలక్‌పేటలో దంపతులు కాపురం పెట్టారు. ఆమెపై అనుమానంతో వినయ్ వేధించేవాడు. ఈ క్రమంలోనే భార్యను చంపి, గుండెపోటుతో మరణించినట్లు చిత్రీకరించాడు. చివరకు హత్య విషయం బయటపడడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Similar News

News November 21, 2025

సిద్దిపేట: ఆపరేషన్ వద్దు సాధారణ కాన్పు ముద్దు: DMHO

image

సిజేరియన్ ఆపరేషన్ వద్దు.. సాధారణ కాన్పు ముద్దు అని DMHO డా.ధనరాజ్ అన్నారు. శుక్రవారం సిద్దిపేట, హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని మీర్జాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, బస్తీ దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో ప్రజలకు అందుతున్న ఆరోగ్య సేవలను అడిగి తెలుసుకున్నారు. రికార్థులను పరిశీలించారు. సీజనల్ వ్యాధుల పట్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.

News November 21, 2025

బాపట్ల: ‘మత్స్యకారులు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక’

image

మత్స్యకారులు, ఆక్వా ఫార్మర్లు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక అని బాపట్ల జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్ అన్నారు. నిజాంపట్నం సైక్లోన్ భవన్ వద్ద శుక్రవారం జరిగిన ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం వేడుకల్లో డీఆర్ఓ పాల్గొన్నారు. గంగపుత్రుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరుడు ప్రసాద్ అన్నారు.రాష్ట్ర అగ్నికుల క్షత్రియ ఛైర్మన్ పాపారావు పాల్గొన్నారు.

News November 21, 2025

బెట్టింగ్ యాప్స్ కేసు.. విచారణకు నిధి, శ్రీముఖి

image

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరి సీఐడీ విచారణకు హాజరయ్యారు. యాప్స్ ప్రమోషన్స్, డబ్బుల లావాదేవీలపై అధికారులు వారిని ప్రశ్నించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే రానా, ప్రకాశ్ రాజ్ తదితరులను సీఐడీ విచారించింది.