News March 4, 2025
HYDలో శిరీషను చంపి డ్రామా!

మలక్పేట జమున టవర్స్లో శిరీష మృతి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెది సహజ మరణం కాదని పోస్టుమార్టం నివేదికలో తేలింది. పోలీసుల వివరాలు.. 2016లో వినయ్ను శిరీష ప్రేమ వివాహం చేసుకుంది. మలక్పేటలో దంపతులు కాపురం పెట్టారు. ఆమెపై అనుమానంతో వినయ్ వేధించేవాడు. ఈ క్రమంలోనే భార్యను చంపి, గుండెపోటుతో మరణించినట్లు చిత్రీకరించాడు. చివరకు హత్య విషయం బయటపడడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Similar News
News October 15, 2025
క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: దుద్దళ్ల

క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం మంథని పట్టణంలోని శివ కిరణ్ గార్డెన్స్లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఎంపికలో భాగంగా సంఘటన్ శ్రీజన్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కార్యకర్తల అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని, జిల్లా పార్టీ అధ్యక్షుడి నియామకం జరుగుతుందని పేర్కొన్నారు.
News October 15, 2025
జూబ్లీలో వేడి రాజుకుంది.. బీజేపీ గమ్మునుంది

జూబ్లీహిల్స్ బైపోల్ వేడి రాజుకుంది. కానీ ఈ పోరులోకి BJP ఎంట్రీ ఇవ్వకపోగా అభ్యర్థి ప్రకటనపై సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ముగ్గురు పేర్లు చీఫ్ రాంచందర్రెడ్డి, అగ్రనేతలు షార్ట్లిస్ట్ చేశారు. వీరిలో దీపక్రెడ్డి, కీర్తిరెడ్డి, డా.పద్మ పేర్లు ఉన్నట్లు సమాచారం. బీసీ నేత అయితే బాగుంటుందని ఢిల్లీ పెద్దల యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థి ప్రకటనపై పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది.
News October 15, 2025
NZB: మీ పశువులకు టీకాలు వేయించండి

జిల్లాలో గేదెలు, దూడలు, ఆవులు, లేగలకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను నేటి నుంచి నవంబర్ 14 వరకు ఉచితంగా వేయనున్నట్లు జిల్లా పశువైద్య, పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ రోహిత్ రెడ్డి తెలిపారు. జిల్లాలో ఉన్న 1.97 లక్షల పశువులకు ఏడో విడతలో భాగంగా నెల రోజుల పాటు గ్రామాల్లో ఉచితంగా టీకాలు వేస్తారని పేర్కొన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పశువులకు టీకాలు వేయించాలని కోరారు.