News March 4, 2025
HYDలో శిరీషను చంపి డ్రామా!

మలక్పేట జమున టవర్స్లో శిరీష మృతి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెది సహజ మరణం కాదని పోస్టుమార్టం నివేదికలో తేలింది. పోలీసుల వివరాలు.. 2016లో వినయ్ను శిరీష ప్రేమ వివాహం చేసుకుంది. మలక్పేటలో దంపతులు కాపురం పెట్టారు. ఆమెపై అనుమానంతో వినయ్ వేధించేవాడు. ఈ క్రమంలోనే భార్యను చంపి, గుండెపోటుతో మరణించినట్లు చిత్రీకరించాడు. చివరకు హత్య విషయం బయటపడడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Similar News
News November 23, 2025
ఉమ్మడి వరంగల్లో 1,708 పంచాయతీలు

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 75 మండలాల్లో మొత్తం 1,708 గ్రామ పంచాయతీలు, 15,006 వార్డులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. పోలింగ్ కోసం 15,006 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
WGL(11): 317 జీపీలు, 2,754 వార్డులు
HNK(12): 210 జీపీలు, 1,986 వార్డులు
జనగామ(12): 280 జీపీలు, 2,534 వార్డులు
మహబూబాబాద్(18): 482 జీపీలు, 4,110 వార్డులు
ములుగు(10): 171 జీపీలు, 1,520 వార్డులు
భూపాలపల్లి(12): 248 జీపీలు, 2,101 వార్డులు
News November 23, 2025
మచిలీపట్నం: నాన్ వెజ్కు రెక్కలు.!

కార్తీక మాసం ముగియటంతో జిల్లాలో మాంసపు దుకాణాలు ప్రజలతో కిటకిటలాడుతున్నాయి. నెల రోజులపాటు మాంసాహారానికి దూరంగా ఉన్న ప్రజలు ఆదివారం మార్కెట్కు వెళ్లి తమకు ఇష్టమైన మాంసాహారం (చికెన్, మటన్, చేపలు, రొయ్యలు, పీతలు) కొనుగోలు చేస్తున్నారు. నెల రోజుల పాటు తగ్గిన మాంసాహారాల ధరలు ఆదివారం ఆమాంతం పెరిగిపోయాయి. కేజీ మటన్ రూ.900, చికెన్ రూ. 220, రొయ్యలు రూ.400ల వరకు అమ్ముతున్నారు.
News November 23, 2025
OTP విధానంతో పంట విక్రయం: కలెక్టర్ రాజర్షి షా

కౌలు రైతుల కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున సదుపాయాలు కల్పిస్తోందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. కలెక్టరేట్లో వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ శాఖలతో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. కౌలు రైతులు పత్తితో పాటు సోయాబీన్, మొక్కజొన్న పంటలను కూడా OTP విధానంతో విక్రయించుకునే అవకాశం కల్పించామని తెలిపారు. రైతులు తమ సందేహాల నివృత్తికి 6300001597 నంబర్కు కాల్ చేయాలని సూచించారు.


