News March 5, 2025
HYDలో శిరీష హత్య కేసులో ట్విస్ట్

మలక్పేటలో శిరీష హత్య కేసులో మరో కోణం వెలుగుచూసింది. భర్త వినయ్ సోదరి సరిత హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. మత్తు మందు ఇచ్చి మర్డర్ చేసినట్లు నిర్ధారించారు. ఇది తెలిసి వినయ్ మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించాడు. గుండెపోటుతో చనిపోయిందని చిత్రీకరించాడు. చివరకు పోలీసులకు దొరికిపోయాడు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Similar News
News March 26, 2025
HYD: అమ్మానాన్న సారీ.. స్టేటస్ పెట్టి SUICIDE

మేడ్చల్ జిల్లా గౌడవెల్లిలో సోమేశ్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. సోదరి వివాహం కోసం దాచిన డబ్బులతో పాటు సోమవారం జరిగిన IPLలో ఒక్కరోజే లక్ష పోగొట్టుకున్నాడు. దీంతో అతడు.. ‘నేను సూసైడ్ చేసుకోవాలని డిసైడయ్యా. డబ్బుల విషయంలో ఆత్మహత్యకు పాల్పడడం లేదు. నా మైండ్ సెట్ కంట్రోల్ కావడం లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. అమ్మానాన్న, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సారీ’ అని స్టేటస్ పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు.
News March 26, 2025
గ్రేటర్లో స్ట్రీట్ లైట్లకు త్వరలో యాప్

గ్రేటర్ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో అంధకారం నెలకొందన్న ఫిర్యాదులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. వీటి మెరుగైన నిర్వహణకు సాంకేతికత వినియోగించాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు కమిషనర్ ఇలంబర్తి తెలిపారు.
News March 26, 2025
సికింద్రాబాద్లో యాక్సిడెంట్.. ఇద్దరు మృతి

సికింద్రాబాద్ మహంకాళి PS పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం.. వేగంగా వచ్చిన కారు బైక్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో స్పాట్లోనే ఒకరు మృతి చెందగా.. మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. స్పాట్ వద్ద సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.