News February 1, 2025

HYDలో హృదయవిదారక ఘటన

image

HYDలోని వారాసిగూడ PSపరిధిలో <<15323241>>ఇంట్లో తల్లి మృతదేహంతో<<>> ఇద్దరు కూతుర్లు ఉన్న విషయం తెలిసిందే. అయితే బౌద్ధనగర్‌లోని ఓ ఇంట్లో నివాసముంటూ తల్లి ఇద్దరు కూతుర్లను చూసుకుంటోంది. తండ్రి ఆ కుటుంబాన్ని వదిలి వెళ్లిపోగా.. గత కొద్దిరోజులుగా తల్లి లలిత అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందింది. దహన సంస్కారాలకు డబ్బులు లేకపోవడంతో 9 రోజులుగా మృతదేహాన్ని పక్కనే పెట్టుకొని ఉండిపోగా ప్రస్తుతం ఆ పిల్లలు తల్లిలేక అనాథలయ్యారు.

Similar News

News November 12, 2025

గ్రామ పంచాయతీలకు శుభవార్త

image

AP: పట్టణాభివృద్ధి సంస్థల(UDA) పరిధిలోని గ్రామ పంచాయతీల్లో భూవినియోగ మార్పిడికి ఎక్స్‌టర్నల్ డెవలప్‌మెంట్ ఛార్జ్(EDC) విధిస్తారు. ఇందులో 15% UDAలకు, 85% పంచాయతీలకు చెందేలా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే నగదు UDA ఖాతాల్లోకి వెళితే తిరిగి రావడం కష్టమని అధికారులు అభిప్రాయపడటంతో వాటా మొత్తం నేరుగా పంచాయతీల ఖాతాలకే జమ అయ్యేలా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీంతో గ్రామాలకు అదనపు ఆదాయం లభించనుంది.

News November 12, 2025

పుట్టిన రోజు నాడే యువకుడి ఆత్మహత్య

image

పుట్టినరోజు నాడే ఓ యువకుడి ఆత్మహత్య ఘటన కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. కొలిమిగుండ్ల(M) అంకిరెడ్డిపల్లెకు చెందిన దాసరి కార్తీక్‌(23) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం పుట్టినరోజు వేడుకలకు కుటుంబీకులు సిద్ధమవుతుండగా ఇంట్లో ఉరివేసుకున్నాడు. జీవితంపై విరక్తి చెంది సూసైడ్ చేసుకున్నట్లు CI రమేశ్ బాబు వెల్లడించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ ఘటనతో స్నేహితులు, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు.

News November 12, 2025

వరంగల్: ఇంటికి రూ.15 వేలు

image

మొంథా తుఫాన్ బాధితులకు ఇంటికి రూ.15,000 చొప్పున నష్టపరిహారం అందించేందుకు ఉమ్మడి జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం రూ.12.12 కోట్లు మంజూరు చేసింది. HNKలో 4,691 ఇళ్లకు రూ. 7.03 కోట్లు, WGLలో 3,368 ఇళ్లకు రూ.5.05 కోట్లు విడుదలయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం ఈ నిధులు మంజూరయ్యాయి. MHBD జిల్లాలో 16 ఇళ్లు పాక్షికంగా దెబ్బతినగా రూ.2.40 లక్షలు, ములుగులో 5 ఇళ్లకు రూ.75 వేల పరిహారం విడుదల చేశారు.