News February 19, 2025

HYDలో 3 లక్షల మంది AI నిపుణులు: మంత్రి

image

ప్రపంచ నగరాలు టెక్నాలజీ అంటే HYD నగరం వైపే చూసేలా తీర్చిదిద్దుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర IT మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. HYDలో సమ్మిట్లో పాల్గొన్న మంత్రి, HYDలో 1500కు పైగా ఐటీ కంపెనీలు ఉన్నాయని, వీటిలో 15 లక్షల మందికిపైగా పనిచేస్తున్నారని తెలిపారు. వీరిలో 3 లక్షల మంది AI నిపుణులు, లక్ష మంది చిప్ డిజైనర్లు ఉన్నట్లుగా తెలిపారు.

Similar News

News April 12, 2026

బాపట్ల: దారుణం.. అర్ధరాత్రి ఇంట్లో RMP డాక్టర్ హత్య?

image

బాపట్ల (D) అద్దంకి మండలం ధర్మవరంలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఘోరం జరిగింది. RMP డాక్టర్‌ మేడగం కోటిరెడ్డిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. రాత్రి ఒంటిగంట సమయంలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు గుర్తించారు. సమాచారం అందిన వెంటనే సీఐ సుబ్బరాజు ఘటనాస్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News April 12, 2026

రామగుండం-మణుగూరు రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్

image

రాష్ట్ర రైల్వే నెట్‌వర్క్‌లో మరో కీలక ముందడుగు పడింది. రామగుండం–మణుగూరు మధ్య 207 KM కొత్త రైల్వే లైన్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. ₹2,911 కోట్లతో నిర్మించే ఈ మార్గం రాఘవాపూర్, మంథని, భూపాలపల్లి, మేడారం మీదుగా సాగనుంది. ఈ లైన్ అందుబాటులోకి వస్తే 2 ప్రాంతాల మధ్య 90 KM దూరం తగ్గడమే కాకుండా, సింగరేణి బొగ్గు రవాణా వ్యయం భారీగా తగ్గనుంది. దీంతో పారిశ్రామిక, ఆధ్యాత్మిక రంగాలకు కొత్త ఉత్తేజం లభించనుంది.

News April 12, 2026

ఆ భీకర తుపాను.. కోరింగను తుడిచేసింది!

image

కోరింగ నౌకాశ్రయం 18వ శతాబ్దంలో అంతర్జాతీయ వాణిజ్యానికి కేంద్రంగా విరాజిల్లింది. ఇక్కడి నుంచి బర్మా (మయన్మార్) వెళ్లిన తెలుగువారిని అక్కడ ఇప్పటికీ ‘కోరంగీలు’ అని పిలుస్తారు. 1839 నాటి భీకర తుపాను ఈ వైభవాన్ని నాశనం చేసింది. ఆ విపత్తులో 3 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. వాతావరణ చరిత్రలో ‘సైక్లోన్’ అనే పదం ఇక్కడి నుంచే పుట్టింది. ఆ తుపాను చరిత్రలో ఒక మరువలేని విషాద ఘట్టంగా మిగిలిపోయింది.