News September 11, 2024
HYDలో 40 గంటల భారీ బందోబస్తు!
HYD నగరంలో గణపతి నిమజ్జనం చివరి రోజు 40 గంటల పాటు భారీ బందోబస్తు ఉంటుందని సీపీ CV ఆనంద్ తెలిపారు. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, తదితర పోలీసులతో ఆయన సమావేశం నిర్వహించారు. మిలాద్ ఉన్ నబి వేడుకల్లో భాగంగా ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటామన్నారు. రౌడీలు, కమ్యూనల్ అంశాలపై ప్రత్యేక దృష్టి సాధించాలని కిందిస్థాయి అధికారులకు సూచించారు. శాంతియుతంగా వేడుకలు నిర్వహించుకోవాలన్నారు.
Similar News
News October 6, 2024
HYD: మోసాలకు అడ్డా.. ‘గోల్డెన్ ట్రయాంగిల్’
HYD మహా నగరంలో ఆన్లైన్ మోసాలతో రూ.కోట్లు మాయమవుతున్న ఘటనలు బయటపడ్డాయి. BHEL టౌన్షిప్ విశ్రాంత ఉద్యోగి ఖాతా నుంచి రూ.13.16 కోట్లు, KPHB వైద్యుడి నుంచి రూ.8.6 కోట్లు, నోయిడా వ్యాపారి అకౌంట్ నుంచి రూ.9.09 కోట్లు మాయమయ్యాయి. ఈ సొమ్ము ‘గోల్డెన్ ట్రయాంగిల్’గా పిలిచే థాయ్లాండ్ , లావోస్, మయన్మార్ దేశాల్లోని ముఠాల చేతుల్లోకి వెళ్తున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) గుర్తించింది.
News October 6, 2024
HYD: 2,525 చెరువులకు హద్దులు ఖరారు
HYD మహా నగరంలో చెరువులు ఆక్రమణలకు గురవుతున్నాయని పర్యావరణవేత్తలు FTL, బఫర్ జోన్లను నిర్ధారించాలని హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హెచ్ఎండీఏలోని 3,532 చెరువుల్లో 230కి మాత్రమే బఫర్ జోన్ నిర్ధారించారు. 2,525 చెరువులకు హద్దులు ఖరారు చేశారు. కాగా మరో 1,000 చెరువులకు 3 నెలల్లో హద్దులను నిర్ధారించాల్సి ఉంది.
News October 5, 2024
BREAKING: HYD: ఘట్కేసర్ ఇన్స్పెక్టర్ SUSPEND
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ ఇన్స్పెక్టర్ సైదులును సస్పెండ్ చేస్తూ శనివారం రాచకొండ సీపీ సుధీర్బాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్స్పెక్టర్ గడ్డం మహేశ్ హత్య కేసులో డబ్బులు తీసుకుని ఓ వ్యక్తిని కేసు నుంచి తప్పించాడనే ఆరోపణల నేపథ్యంలో మహేశ్ తరఫు బంధువులు రెండు రోజుల క్రితం సీపీకి ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం రాచకొండ సీపీ సుధీర్బాబు ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.