News February 20, 2025
HYDలో KCR సమావేశం.. కీలకనేతలు డుమ్మా

తెలంగాణ భవన్లో బుధవారం KCR అధ్యక్షతన జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ఆ పార్టీ కీలక నేతలు రాకపోవడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రులు గంగుల కమలాకర్, మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి రాలేదు. ఉప్పల్ MLA లక్ష్మారెడ్డి తన వదిన దశదినకర్మ నేపథ్యంలో హాజరు కాలేకపోయారని పార్టీ వర్గాల సమాచారం. కాగా.. మిగతా ఎమ్మెల్యేలు గైర్హాజరుకు గల కారణాలు తెలియాల్సింది ఉంది.
Similar News
News November 12, 2025
HYD: ఏడాదికి 20 వేలకు పైగా క్యాన్సర్ కేసులు..!

HYDలోని MNJ క్యాన్సర్ ఆసుపత్రికి ప్రతి సంవత్సరం సుమారు 20,000 మంది కొత్త క్యాన్సర్ బాధితులు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా రోగులు ఈ ప్రభుత్వ వైద్య కేంద్రానికి వస్తున్నారు. ఆసుపత్రిలో ఉచితంగా కీమోథెరపీ, రేడియేషన్, సర్జరీ సేవలు అందుబాటులో ఉన్నాయి. మహిళలు, పిల్లల కోసం ప్రత్యేక విభాగాలు, పాలియేటివ్ కేర్ యూనిట్లు కూడా ఉన్నాయి.
News November 12, 2025
జూబ్లీహిల్స్: సర్వేల్లో BRS.. ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్..!

జూబ్లీహిల్స్ బైపోల్ ఫలితాలపై లోకల్ వాళ్లే కాదు తెలుగు రాష్ట్రాల వారు తీవ్ర ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కాగా ఎలక్షన్ ముందు దాదాపు అన్ని సర్వేలు BRS గెలుస్తుందని చెప్పగా ఎగ్జిట్ పోల్స్లో మాత్రం ఎక్కువ సర్వేలు కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పాయి. దీంతో థగ్ ఆఫ్ వార్ పోటీ ఉందంటూ ఇరు పార్టీల నేతలు తలలు పట్టుకుంటున్నారు. NOV 14న వెలువడే ఫలితాల్లో గెలుపు మాదే అంటూ ఇరు పార్టీలు ధీమాగా ఉన్నాయి.
News November 12, 2025
HYD రానున్న.. ఫుట్బాల్ లెజెండ్ మెస్సీ

ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ డిసెంబర్లో HYDకు రానున్నారు. CM రేవంత్ రెడ్డి రూపొందించిన ‘తెలంగాణ రైజింగ్ 2047’ ప్రణాళికకు మెస్సీని బ్రాండ్ అంబాసడర్గా నియమించే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ ప్రణాళిక ద్వారా తెలంగాణను 2033 నాటికి 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే లక్ష్యంగా ముందుకు సాగుతుంది.


