News February 20, 2025
HYDలో KCR సమావేశానికి కీలకనేతలు డుమ్మా

తెలంగాణ భవన్లో బుధవారం KCR అధ్యక్షతన జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ఆ పార్టీ కీలక నేతలు రాకపోవడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రులు గంగుల కమలాకర్, మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి వదిన దశదినకర్మ నేపథ్యంలో హాజరు కాలేకపోయారని పార్టీ వర్గాల సమాచారం. కాగా.. మిగతా ఎమ్మెల్యేలు గైర్హాజరుకు గల కారణాలు తెలియాల్సింది ఉంది.
Similar News
News November 21, 2025
HYD: నిఖత్ జరీన్కు మంత్రి శుభాకాంక్షలు

గ్రేటర్ నోయిడాలో జరిగిన వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నిఖత్ జరీన్ గోల్డ్ మెడల్ సాధించడంపై HYD ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. బాక్సర్ నిఖత్ జరీన్ మరోసారి తెలుగు జాతి గౌరవాన్ని ఖండాంతరాలు దాటించిందని మంత్రి అభినందించారు. నిఖత్ జరీన్ భవిష్యత్లో మరెన్నో అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించి దేశ, రాష్ట్రాల ప్రతిష్ఠను మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.
News November 21, 2025
సికింద్రాబాద్ మహంకాళమ్మ ఆలయంలో రుద్రహోమం

కార్తీక మాసం చివరి రోజు అమావాస్య సందర్భంగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఈరోజు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీమహాకాళేశ్వర స్వామి, శ్రీవీరభద్ర స్వామికి 108 లీటర్ల పాలు, పండ్లతో అభిషేకం చేశారు. రుద్రహోమం నిర్వహించగా ఆలయ ఈఓ మనోహర్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. కార్తీక మాసం ముగింపు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు.
News November 21, 2025
సికింద్రాబాద్ మహంకాళమ్మ ఆలయంలో రుద్రహోమం

కార్తీక మాసం చివరి రోజు అమావాస్య సందర్భంగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఈరోజు ప్రత్యేక పూజలు చేశారు. శ్రీమహాకాళేశ్వర స్వామి, శ్రీవీరభద్ర స్వామికి 108 లీటర్ల పాలు, పండ్లతో అభిషేకం చేశారు. రుద్రహోమం నిర్వహించగా ఆలయ ఈఓ మనోహర్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. కార్తీక మాసం ముగింపు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు.


