News November 20, 2024
HYDకు రాష్ట్రపతి.. మాదాపూర్లో డ్రోన్లు నిషేధం

ఈ నెల 21, 22న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము HYDలో పర్యటిస్తారు. 22న హైటెక్సిటీ శిల్పకళా వేదికలో లోక్ మంతన్-2024 కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రెసిడెంట్ టూర్ నేపథ్యంలో CYB పోలీసులు అప్రమత్తమయ్యారు. మాదాపూర్ PS పరిధిలో డ్రోన్లు ఎగరేయడాన్ని నిషేధించారు.ఈ ఆదేశాలు నవంబర్ 22 వరకు అమల్లో ఉంటాయన్నారు. పోలీసుల ఆదేశాలు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ CP అవినాష్ మహంతి హెచ్చరించారు. SHARE IT
Similar News
News September 18, 2025
అమీర్పేటలో వాల్యూ జోన్ వచ్చేసింది!

నగరంలోని షాపింగ్ ప్రియులకు శుభవార్త. సిటీ నడిబొడ్డున ఉన్న అమీర్పేటలో వాల్యూ జోన్ వచ్చేసింది. 75,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రారంభించిన అతిపెద్ద షాపింగ్ మాల్ ఇది. ఈ దసరాకు ఇక్కడ ఫ్యాషన్, గ్రాసరీ, హోమ్ వేర్, వస్తు సామగ్రిపై ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. కుటుంబంలోని అన్ని తరాల వారిని దృష్టిలో పెట్టుకొని అమీర్పేటలో బ్రాంచ్ ఓపెన్ చేసినట్లు ఫౌండర్ శ్రీ పొట్టి వెంటటేశ్వర్లు తెలిపారు.
News September 18, 2025
BREAKING: మైసమ్మగూడ చెరువులో తండ్రి, కూతురు మృతి

మేడ్చల్ జిల్లాలోని మైసమ్మగూడ చెరువులో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. గురువారం ఉదయం ఇది గమనించిన స్థానికులు పేట్బషీరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు, హైడ్రా సిబ్బంది మృతదేహాలను వెలికితీశారు. మృతులు బహదూర్పల్లిలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన అశోక్ (50), కూతురు దివ్య(5)గా గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News September 18, 2025
HYD: బతుకమ్మ, దసరా కోసం ప్రత్యేక బస్సులు

బతుకమ్మ, దసరాకు ప్రయాణికుల కోసం TGSRTC 7,754 ప్రత్యేక బస్సులు నడపనుంది. ఈ నెల 20 నుంచి అక్టోబర్ 2 వరకు స్పెషల్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. MGBS, JBS, CBS, KPHB, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, ఆరాంఘర్ తదితర ప్రాంతాల నుంచి స్పెషల్ బస్సులు నడపనున్నట్లు TGSRTC ప్రకటించింది.