News September 4, 2024

HYDను క్రీడా రాజధానిగా మార్చడమే లక్ష్యం: CM

image

HYD నగరాన్ని భారతదేశ క్రీడా రాజధానిగా మార్చడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. HYD గచ్చిబౌలిలో ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన సందర్భంగా సీఎం ప్రసంగించారు. 4 దేశాల ఫుట్‌బాల్ టోర్నమెంట్, అఖిల భారత ఫుట్ బాల్ సమాఖ్య (AIFF) హైదరాబాద్లో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అన్ని జట్లకు, క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News September 27, 2024

HYD: బొడ్డెమ్మ.. బొడ్డెమ్మా కోల్.. బిడ్డాలెందరూ కోల్..!

image

తెలంగాణ ఆడబిడ్డలకు ఇష్టమైన పండుగ బొడ్డెమ్మ.. బతుకమ్మ పండుగకు ముందు 9, 5, 3 రోజులు ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఈ పండుగను జరుపుకుంటారు. తెలంగాణ సంప్రదాయం పాటించే కన్నెపిల్లలు, బాలికలు మట్టితో చేసిన బొడ్డెమ్మలను పెట్టి, పూలతో అలంకరించి చుట్టూ తిరుగుతూ ‘బొడ్డెమ్మ.. బొడ్డెమ్మా కోల్‌.. బిడ్డాలెందరూ కోల్‌’ అంటూ కోలాటం ఆడతారు. మరి మీ ప్రాంతంలో బొడ్డెమ్మ పండుగ చేస్తే Way2Newsకు ఫొటోలతో వార్త పంపండి.

News September 27, 2024

HYD: బాపూజీ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక: సీపీ

image

కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు, కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక బాపూజీ అని పేర్కొన్నారు. ఆయన కృషికి గుర్తుగా ఇటీవల ప్రభుత్వం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి వారి పేరు పెట్టినట్లు గుర్తు చేసుకున్నారు.

News September 27, 2024

HYD: ఈడీతో భయపెట్టాలని చూస్తే నడవదు: మహేశ్‌గౌడ్

image

బీజేపీ, బీఆర్ఎస్ సలహాల మేరకే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంపై ఈడీ రైడ్స్ చేశారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాజకీయ కక్షతోనే పొంగులేటి ఇంటిపై ఈడీ దాడులు చేసిందని, ఈడీతో భయపెట్టాలని చూస్తే తమ వద్ద నడవదన్నారు. ప్రభుత్వానికి వచ్చే ఆదరణ చూసి ఓర్వలేక నాయకులను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.