News October 28, 2025

HYDలోనూ పెరుగుతున్న లగ్జరీ హౌసెస్!

image

భారతదేశంలోని విలాసవంతమైన నగరాల్లో లగ్జరీ గృహాల విక్రయాలు వేగంగా పెరుగుతున్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పూణే తర్వాత HYD, చెన్నై, కోల్‌కత్తా వంటి 7 ప్రధాన నగరాల్లో 2025 జనవరి నుంచి జూన్ వరకు సుమారు 55,640 లగ్జరీ గృహాలు విక్రయమైనట్లు ప్రాపర్టీ కన్సల్టింగ్ కంపెనీ గుణాంకాలు తెలిపాయి. మౌలిక సదుపాయాలు, జీవన ప్రమాణాలు మెరుగవడం ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు.

Similar News

News October 29, 2025

జగిత్యాల: ST యువతకు ఉపాధి అవకాశాలు

image

తెలంగాణ డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఎస్టీ నిరుద్యోగ యువతీయువకులకు ఆన్‌లైన్ ద్వారా వివిధ రంగాల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు జగిత్యాల జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కే.రాజ్‌కుమార్ తెలిపారు. జగిత్యాల జిల్లాలోని ఆసక్తిగల ఎస్టీ నిరుద్యోగులు https://deet.telangana.gov.in వెబ్‌ సైట్‌లో నమోదు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

News October 29, 2025

టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు

image

◆ బ్రహ్మోత్సవాల్లో పనిచేసిన పర్మినెంట్ ఉద్యోగులకు ₹15,400, కాంట్రాక్ట్/అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ₹7,535 చొప్పున బహుమానం.. తిరుమల, తిరుపతి సిబ్బందికి అదనంగా 10%
◆ గోశాలల నిర్వహణకు నిపుణుల కమిటీ ఏర్పాటు.. నివేదిక ఆధారంగా సంస్కరణలు
◆ కొనుగోలు విభాగంలో అవకతవకలపై ACBతో విచారణ
◆ కాణిపాకం ఆలయం వద్ద ₹25Crతో యాత్రికుల వసతి సముదాయం, వివాహ హాల్స్ నిర్మాణానికి ఆమోదం

News October 29, 2025

సిద్దిపేట: ‘దరఖాస్తు తేదీ పొడిగింపు’

image

2025-2026 విద్యా సంవత్సరానికి మైనారిటీ విద్యార్థుల పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తుల గడువు తేదీ పొడిగించినట్లు సిద్దిపేట జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి అహ్మద్ తెలిపారు. సిద్దిపేట జిల్లాకు చెందిన కళాశాలలు, విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. డిసెంబర్ 31 వరకు గడువు పొడగించామని తెలిపారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలన్నారు.